Unique Temple Prasadam: శీర్షిక చదివిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కదా.. మనం ఏదైనా ఆలయానికి వెళ్తే… దైవదర్శనం పూర్తయిన తర్వాత అర్చకులు మనకు ప్రసాదంగా లడ్డు లేదా పులిహోర ఇస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఆలయ ప్రాశస్త్యానికి అనుగుణంగా ప్రసాదాన్ని మనకు అందజేస్తారు. కానీ ఈ ఆలయం మాత్రం పూర్తి విభిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ దైవదర్శనం పూర్తయిన తర్వాత మనకు ప్రసాదంగా లడ్డు ఇవ్వరు. పులిహోర అంతకంటే ఇవ్వరు.
రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోడ్ గడ్ జిల్లాలో బానోడ బాలాజీ ఆలయంలో భక్తులకు ప్రసాదంగా లడ్డూలు.. పులిహోర ఇవ్వరు. ఈ ఆలయంలో భక్తుల నుంచి వచ్చే కానుకల్లో కొంత భాగాన్ని భక్తులకే ప్రసాదం రూపంలో అందిస్తుంటారు. వీటిని భక్తులు భద్రపరచుకుంటే సిరిసంపదలు కలుగుతాయని.. వ్యాపారం , వ్యవసాయంలో లాభాలు వస్తాయని భక్తులు నమ్ముతుంటారు. తమ కోరిన కోరికలు నెరవేరితే భక్తులు తాము పొందిన డబ్బుకు మరింత రెట్టింపు ఈ ఆలయానికి ఇస్తుంటారట.
ఈ ఆలయాన్ని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఇక్కడి ప్రజలు భావిస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆలయం భక్తులతో రద్దీగానే ఉంటుంది. ఉత్సవాలు, వేడుకల సమయంలో ఇక్కడ భక్తులు అధికంగా ఉంటారు. ఎంత స్థాయిలో భక్తులు వచ్చినప్పటికీ.. వారికి డబ్బు రూపంలో ప్రసాదాన్ని అందజేస్తూనే ఉంటారు. అందువల్లే ఈ క్షేత్రానికి విశిష్టమైన పేరు వచ్చింది.. తిరుపతి మాదిరిగానే ఇక్కడి బాలాజీకి ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి.. ఉత్సవాల సమయంలో ఈ ఆలయం శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది.
డబ్బులు మాత్రమే కాకుండా.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు పులిహోర.. లడ్డు ప్రసాదం ఇస్తారు. కాకపోతే అది డబ్బులతో కొనుగోలు చేయాలి.. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని విస్తరిస్తున్నారు.. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. అందువల్లే నిర్ణీత సమయాలలోనే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు.