కరోనా నుంచి కోలుకున్న కేంద్రమంత్రి

కరోనా బారిన పడిన కేంద్రమంత్రి స్మ్రుతి ఇరానీ కోలుకున్నారు. తాజాగా ఆమె కరోనా పరీక్షలు చేయించుకోవడంతో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గత నెల 28న బీహార్ లోని బుద్దగయ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఆ తరువాత నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం మంత్రి తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.‘ నేను కరోనా పరీక్ష చేయించుకోగా అందులో […]

Written By: Velishala Suresh, Updated On : November 12, 2020 10:10 am
Follow us on

కరోనా బారిన పడిన కేంద్రమంత్రి స్మ్రుతి ఇరానీ కోలుకున్నారు. తాజాగా ఆమె కరోనా పరీక్షలు చేయించుకోవడంతో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. గత నెల 28న బీహార్ లోని బుద్దగయ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె ఆ తరువాత నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం మంత్రి తనకు నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.‘ నేను కరోనా పరీక్ష చేయించుకోగా అందులో నెగెటివ్ వచ్చింది. నేను కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.