
దేశంలో కొత్తగా 47,905 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 47,905 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 550 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,917గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,28,121కి చేరింది. ప్రస్తతం దేశంలో 4,89,294 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 80,66,501 గా ఉంది. గత పది రోజులుగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. కాగా మరణాల రేటు 1.48 శాతంగా ఉంది. రికవరీ రేటు 92.89 శాతంగా ఉంది.