Site icon OkTelugu

యూపీలో 17 మంది ఐఎఎస్ అధికారులపై సీఎం యోగి బదిలీవేటు

కొత్త సంవత్సరం రోజే హథ్రాస్ జిల్లాతోపాటు 17 మంది ఐఎఎస్ అధికారులపై ఆదిత్యనాథ్ యోగి సర్కారు బదిలీవేటు వేసింది.సామూహిక అత్యాచారానికి గురైన హథ్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ పర్వీన్ కుమార్ లక్సార్ తోపాటు 17 మంది ఐఎఎస్ అధికారులను యోగి ప్రభుత్వం బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హథ్రాస్ ఘటనపై తగిన చర్యలు తీసుకోకపోవడంపై అలహాబాద్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పర్వీన్ కుమార్ ను మీర్జాపూర్ కు బదిలీ చేశారు. లక్నోలోని జల్ నిగమ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు రమేష్ రంజన్ ను కొత్త హధ్రాస్ జిల్లా మెజిస్టేటుగా నియమించారు.

Exit mobile version