కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా ప్రముఖులు మాత్రం వైరస్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు. తాజాగా రాజస్థాన్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆదివారం అర్ధరాత్రి మరణించారు. గత కొన్ని రోజుల కిందట ఆమెకు కరోనా సోకడంతో గుర్గావ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆమె ప్రస్తుతం రాజ్సమంద్ నియోజకవర్గం నుంచి బీజేపీ […]

Written By: Suresh, Updated On : November 30, 2020 9:15 am
Follow us on

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా ప్రముఖులు మాత్రం వైరస్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందారు. తాజాగా రాజస్థాన్ విద్యాశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆదివారం అర్ధరాత్రి మరణించారు. గత కొన్ని రోజుల కిందట ఆమెకు కరోనా సోకడంతో గుర్గావ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆమె ప్రస్తుతం రాజ్సమంద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే 2004లో ఉదయ్ పూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత 2009లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు.