ఏలూరులో మరణమృదంగం.. మరో ఇద్దరు మృతి.. కారణమేంటి?

కొత్త రోగాలు పుట్టి సగం జనాభా అంతరిస్తుందని బ్రహ్మంగారు కలియుగ కాలజ్ఞానంలో సెలవిచ్చారు. ఇప్పుడు మొన్నటివరకు కరోనా ఇప్పుడు వింత వింత వ్యాధులు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. Also Read: హస్తినకు కేసీఆర్.. ప్రధానిని కలుస్తారా? తాజాగా ఏపీలోని ఏలూరు వాసుల్లో వింత వ్యాధి గుబులు రేపుతోంది. ఈ క్రమంలోనే వింత వ్యాధి బాధితుల్లో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న రోగులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఏలూరు వాసుల్లో ఇప్పుడు వింత వ్యాధి […]

Written By: NARESH, Updated On : December 10, 2020 12:53 pm
Follow us on

కొత్త రోగాలు పుట్టి సగం జనాభా అంతరిస్తుందని బ్రహ్మంగారు కలియుగ కాలజ్ఞానంలో సెలవిచ్చారు. ఇప్పుడు మొన్నటివరకు కరోనా ఇప్పుడు వింత వింత వ్యాధులు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.

Also Read: హస్తినకు కేసీఆర్.. ప్రధానిని కలుస్తారా?

తాజాగా ఏపీలోని ఏలూరు వాసుల్లో వింత వ్యాధి గుబులు రేపుతోంది. ఈ క్రమంలోనే వింత వ్యాధి బాధితుల్లో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న రోగులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఏలూరు వాసుల్లో ఇప్పుడు వింత వ్యాధి గుబులు రేపుతోంది. తాజాగా ఈ వ్యాధితో మరో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న రోగులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే మొత్తం 30మందిని తరలించగా.. వారిలో సుబ్బరావమ్మ (56), అప్పారావు (50) బుధవారం మృతి చెందారు.

అయితే సుబ్బరావమ్మ కరోనాతో.. అప్పారావు టీబీతో బాధపడుతున్నారని.. వారి వల్లే చనిపోయారని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆదివారం రాత్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మైనేని శ్రీధర్ చనిపోవడం విషాదం నింపింది.

Also Read: పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వారికి మాత్రమే..?

కరోనా వింత వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 592కి చేరింది. ఇప్పటివరకు 511 మంది రోగులను డిశ్చార్జ్ చేయగా.. ప్రస్తుతం 46 మంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రోజురోజుకు వింత వ్యాధి విస్తరిస్తుండడం.. దానికి కారణం తాగునీటిలో ‘లెడ్’ అవశేషాలు పెరగడం అన్న నివేదికల నేపథ్యంలో ఏలూరులో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్