కుమ్రం బఈం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్ నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్య చేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55) ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.