Homeఆధ్యాత్మికంFestivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి. దీంతో ప్రతి ఇంట్లో, దేవాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. భక్తులు పూజలు, వ్రతాలతో నిత్యం దైవ నామస్మరణ చేస్తుంటారు. అయితే 2026 ఏడాదిలో ఏ ఏ తేదీలలో ఏఏ పండుగలు వస్తాయో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఏ తేదీలో ఏ పండుగలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

జూలై 25న తొలి ఏకాదశి తర్వాత ఇదే నెలలో 29న గురు పౌర్ణమి రాబోతుంది. గురువును దైవ స్వరూపం గా భావించి ఈ రోజున తమకు విద్యను, జ్ఞానాన్ని అందించిన వారిని ప్రత్యేకంగా సత్కరిస్తారు. వారి ఆశీస్సులు పొంది భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అలాగే ఈరోజు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి.

శ్రావణమాసం ప్రారంభం కాగానే ఆగస్టు 18న మంగళ గౌరీ పూజను నిర్వహించనున్నారు. వివాహితులు తమ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ చేసే ఈ వ్రతం తో ఆయా ఇళ్లల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అలాగే ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. లక్ష్మీదేవిని వరలక్ష్మీ రూపంలో పూజిస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే కొన్ని పంచాంగాల్లో వరలక్ష్మి వ్రత తేదీని ఆగస్టు 28న కూడా నిర్వహించాలని చెబుతున్నారు. ఈ వ్రతాన్ని పాటించేవారు సమీప పండితులను సంప్రదించి నిర్వహించుకోవాలి.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను ఆగస్టు 28న నిర్వహించుకోనున్నారు. ఈ రోజున సోదరుడికి సోదరి రాఖీ కట్టి తమ ప్రేమను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సంతోషంగా గడుపుతారు. సెప్టెంబర్ 14న వినాయక చవితిని నిర్వహించుకోనున్నారు. ఆది దేవుడిగా పిలిచే వినాయకుడిని ఈరోజు వాడవాడలా ప్రతిష్టించి నవరాత్రులు నిర్వహించనున్నారు.

తెలంగాణతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిర్వహించే దసరా పండుగ అక్టోబర్ 20న రానుంది. అయితే దీనికంటే ముందు తెలంగాణలో బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోనున్నారు. అయితే సద్దుల బతుకమ్మ తేదీని ఆయా ప్రాంతాలను బట్టి తేదీలు మారుతూ ఉంటాయి. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.

అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను నిర్వహించుకోనున్నారు. ఈ ఏడాదిలో దీపావళి వేడుకలు నవంబర్ 8న ఉండనున్నాయి. ఈ రోజున లక్ష్మీ పూజలు నిర్వహిస్తూ కొత్త వ్యాపార ఖాతాను ప్రారంభిస్తారు. డిసెంబర్ 20 న ముక్కోటి ఏకాదశి జరుపుకొనున్నారు. వైష్ణవ ఆలయాల్లో ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణువును దర్శించుకుంటారు.

ఇవే కాకుండా కొన్ని ప్రత్యేక పర్వదినాలు కూడా రానున్నాయి. వరుస పండుగలతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయా రోజుల్లో శుభకార్యాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Oktelugu Epaper
Exit mobile version