మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడం లేదని ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఏ బెంచ్ విచారణ జరపాలో ప్రధాన న్యాయమూర్తి ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అశోక్ గజపతిరాజు పిటిషన్ పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.