Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 1000కి పైగా రోజులు టీమిండియా టి20 నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఎప్పుడైతే గంభీర్ సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టాడో అప్పుడే పరిస్థితి మారిపోయింది. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లలో టీమిండియా కు ఓటమి ఎదురైంది. ఏకంగా వైట్ వాష్ కు గురైంది.
టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా ఈ స్థాయిలో ఓటములు ఎదుర్కోవడంతో నెంబర్ వన్ స్థానం కాస్త.. నెంబర్ టూ కు పడిపోయింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో.. అంతకుముందు రోహిత్ నాయకత్వంలో టీమిండియా టి20 ఫార్మాట్లో బ్రహ్మాండంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. గంభీర్ చేపట్టిన పనికిమాలిన ప్రయోగాల వల్ల టీమిండియా మొదటి స్థానాన్ని కోల్పోయింది. ఆటగాళ్లు కూడా సక్రమంగా ఆడలేకపోయారు.
ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే జట్టుతో టి20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచింది. మూడో మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ మొత్తాన్ని వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియాకు ఒక గుడ్ న్యూస్ లభించింది. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లు కోల్పోయి.. తీవ్ర విమర్శల పాలైన టీమ్ ఇండియా.. జింబాబ్వే జట్టు మీద సిరీస్ గెలిచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ఏకంగా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది
జింబాబ్వేతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో టీమిండియా ఏకంగా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ భారీ అంతరంతో విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా ర్యాంక్ మెరుగుపడింది. నిన్నటిదాకా రెండో స్థానంలో ఉన్న టీం ఇండియా. ఇప్పుడు ఏకంగా మొదటి స్థానంలోకి వచ్చింది. అయితే భారత జట్టుతో పాటు.. ఇంగ్లాండ్ కూడా 268 పాయింట్లతో కొనసాగుతోంది.
జింబాబ్వే సిరీస్ లో టీమిండియా కు శిక్షకుడిగా తెలుగోడు వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. ఇతడి శిక్షణలో టీమిండియా తిరుగులేని స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది. ఇప్పటివరకు ఒకే ఒక సిరీస్ కోల్పోయింది. అది కూడా న్యూజిలాండ్ మీద.. వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమ్ ఇండియాకు ఓటమి అనేది లేకుండా పోయింది.. అందువల్లే గౌతమ్ గంభీర్ ను పక్కనపెట్టి.. వీవీఎస్ లక్ష్మణ్ కు కోచ్ బాధ్యత అప్పగించాలని అభిమానులు కోరుతున్నారు..
గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు టీమిండియా రెండవ స్థానానికి పడిపోయిందని.. ఇప్పుడు గౌతమ్ జట్టుకు దూరంగా ఉన్నప్పుడు.. ర్యాంక్ మారిందని.. దీనిని బట్టి టీమ్ ఇండియాకు శని ఎవరో అర్థం చేసుకోవచ్చని.. అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ కోచ్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలని.. జట్టుకు అనుకూలమైన విధానాన్ని రూపొందించాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


