Karan Johar: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలీయా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా నటిస్తుండడంతో ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఇసినిమా కావడంతో.. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: 2021లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలివే..!
ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచారు చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, ఈ సినిమాను సెప్టెంబరు 9న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాగా, హైదరాబాద్లో బ్రహ్మస్త్ర టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించగా. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. నాగార్జున కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.
రాజమౌళి సినిమాను బాలీవుడ్లో విడుదల చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ, ప్రభాస్, రానాలను పొగిడారు. కాగా, రాజమౌళి తీసిన ఈ గ సినిమా చూసి గాల్లో తేలియానని అన్నారు. రాజమౌళి మన మధ్య ఉండటం భారతీయ సినిమా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్లు పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో పాన్ ఇండియా ఇండియా సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం భారతీయ సినిమాకు ఉన్న పరిధులను రాజమౌళి ఖండాంతరాలకు విస్తరించారని అన్నారు.
Also Read: బాలయ్య కోసం లుక్ మార్చబోతున్న శ్రుతి హాసన్ !
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More