Homeజాతీయ వార్తలుTRS MLAs Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌!

TRS MLAs Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌!

TRS MLAs Purchase Case: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ పోలీసులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రెండు దఫాలుగా.. బీఎల్‌.సంతోష్‌కు ఇచ్చిన నోటిసులపై హైకోర్టు స్టే విధించింది. తాజాగా బండి సంజయ్‌ అనుచరుడు, కరీంనగర్‌ అడ్వకేట్‌ శ్రీనివాస్‌కు ఇటీవల సిట్‌ నోటీసులు ఇచ్చింది. నోటీసుల ప్రకారం శ్రీనివాస్‌ సిట్‌ విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే శ్రీనివాస్‌ను విచారించిన సిట్‌ ఏ7గా అతడిని చేరుస్తు మెమోదాఖలు చేసింది. కానీ పోలీసులు నమోదు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

TRS MLAs Purchase Case
TRS MLAs Purchase Case

నిన్న అలా.. నేడు ఇలా..
ఇక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్‌. సంతోష్, జగ్గుస్వామికి తెలంగాణ హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై సిట్‌ జారీ చేసిన నోటిసులపై స్టేను డిసెంబర్‌ 13 వరకు పొడిగించింది. మొదట ఈ నోటీసులపై సంతోష్‌ హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్‌ 5 వరకు నోటిసులపై స్టే విధించింది. దీనితో సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు డిసెంబర్‌ 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామి సిట్‌ లుకౌట్‌ నోటిసులపై హైకోర్టు ఆశ్రయించారు. దీనితోపాటు నోటిసులపై స్టేను కూడా హైకోర్టు పొడిగించింది. మంగళవారం శ్రీనివాస్‌ను ఏ7గా చేరుస్తూ దాఖలు చేసిన మోమోనూ ఏసీబీ కోర్టు కొట్టేసింది.

వరుస పరిణామాలతో టీఆర్‌ఎస్‌లో టెన్షన్‌..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత ఈ ఘటనకు సంబంధించి ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్‌ బయటపెట్టి మరో సంచలనానికి తెర లేపారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తో కూడిన సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ సిట్‌ ఏపీ, తెలంగాణతోపాటు కేరళ , కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో కీలక సమాచారం రాబట్టిన సిట్‌ మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్, నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ భార్య చిత్రలేఖ, అంబర్‌పేట లాయర్‌ ప్రతాప్‌గౌడ్‌ ఉన్నారు.

TRS MLAs Purchase Case
TRS MLAs Purchase Case

అయితే సిట్‌కు వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్‌ పెరుగుతోంది. కోర్టు తీర్పులు బీజేపీకి అనుకూలంగా వస్తుండడం, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు సిట్‌ తేలిపోతుండడంతో తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం గులాబీ నేతల్లో కనిపిస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version