spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Eluru: ఇదేం రాజ్యం జగనన్న

Eluru: ఇదేం రాజ్యం జగనన్న

Eluru: ఏపీలో వైసీపీ శ్రేణుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికార మదంతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక చోట వైసీపీ నేతల దౌర్జన్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. కోళ్లు దొంగలించారంటూ ముగ్గురిపై వైసీపీ కార్యకర్తలు అమానవీయ చర్యలకు దిగారు. పైపులు కర్రలతో దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. బాధితుల్లో ఒకరు దళిత బాలుడు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం లో వైసిపి కార్యకర్తలు అప్ప సాని ధర్మారావు, కొనకళ్ళ అప్పారావు, ఆచంట రాకేష్,గంట శేఖర్, తోకల సిద్దిరాజు, మురుగుల దుర్గారావులు నాటు కోళ్ల ఫారం ను నిర్వహిస్తున్నారు. ఈనెల 25న అదే గ్రామానికి చెందిన ముప్పిన సురేష్, అరటి కట్ల రాంబాబుతో పాటు దళిత బాలుడు కోళ్ల ఫారం లోకి పనిచేసేందుకు వెళ్లారు.

అయితే ఫారం లో కోళ్లు కనిపించకుండా పోయాయి. దీంతో ఫారం నిర్వహిస్తున్న వైసిపి కార్యకర్తలు… పనికి వచ్చిన ఆ ముగ్గురిపై అనుమానం పెంచుకున్నారు. ఫారం లోకి ఆ ముగ్గురిని పిలిచి మా కోళ్లను మీరే దొంగలించారంటూ ఆరోపించారు. అయితే తమకు తెలియదని ఆ ముగ్గురు ప్రాధేయపడినా వినలేదు. ముగ్గురు దుస్తులను తొలగించి నగ్నంగా కూర్చోబెట్టారు. కర్రలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టి చిత్రహింసలు పెట్టారు. వీపుపై వాతలు తేలిన దెబ్బలతో బాధితులు ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దళిత బాలుడు విషయంలో మరింత అమానుషంగా వ్యవహరించారు. మా కోళ్లనే దొంగతనం చేస్తావా? ఈరోజు మా చేతుల్లో చస్తావ్ అంటూ కులం పేరుతో దూషించారు. అంతటితో ఆగకుండా దుస్తులు తీయించి కటింగ్ ప్లేయర్ తో మర్మాంగాన్ని నొక్కారు. చేతిపై చర్మాన్ని కత్తిరించారు.

వైసీపీ కార్యకర్తల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. వారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన శిక్షలు అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా బాధితుల ఫిర్యాదు పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు రాజీ చేసేందుకు వైసిపి కీలక నాయకులు రంగంలోకి దిగారు. కానీ బాధితులు వినకపోవడంతో కేసు నమోదు చేయాల్సి వచ్చింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version