Homeజాతీయ వార్తలుPM Modi: మోడీ స్టైలే సపరేట్..ఆయన ఏది చేసినా కుంభస్థలాన్ని కొట్టేస్తారు అంతే

PM Modi: మోడీ స్టైలే సపరేట్..ఆయన ఏది చేసినా కుంభస్థలాన్ని కొట్టేస్తారు అంతే

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టైలే సపరేటు. ఆయనేది చేసినా.. కుంభస్థలాన్ని కొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంటారు. నేరుగా విషయం,వ్యక్తిని కార్నర్ చేయకుండానే అనుకున్న లక్ష్యానికి మార్గాలను సుగమం చేసుకోగల్గడంలో పీఎం మోడీ దిట్ట. అరేబియా ద్వీప దేశం మాల్దీవులు భారత్ వ్యతిరేక గుప్పెట్లోకి వెళ్లినప్పుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరించిన రాజనీతిజ్ఞత ప్రశంసలందుకుంది. మాల్దీవులు డ్రాగన్ కీలుబొమ్మగా మారడంతో..ఆ దేశాన్ని దారికి తెచ్చేందుకు మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.

మాల్దీవులు అనేక దీపాల సముదాయం. ఆ దేశానికి పర్యాటకమే ఆయువుపట్టు. మాల్దీవులుకు వెళ్లే టూరిస్ట్ లో అత్యధికులు భారతీయులే ఉండేవారు. ఎప్పుడైతే మాల్దీవులు భారత్ తో సఖ్యతను మెయింటెన్ చేయకుండా చైనాకు దగ్గర అయిందో.. అప్పుడే మోడీ ఆ దేశ పర్యాటక ఆదాయంపై దృష్టి పెట్టేశారు. ఇండియాను శత్రు దేశంగా భావిస్తున్న మాల్దీవులుకు భారత పర్యాటకులు వెళ్లొద్దని..దానికి ప్రత్యామ్నాయంగా లక్ష దీవులను ఎంచుకునేలా అక్కడ తన పర్యటన కొనసాగించారు. లక్షదీవుల్లోని సముద్రంలో కాసేపు సరదాగా ఈత కొట్టి వాటిని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా భారతీయ పర్యాటకులతో పాటు..ప్రపంచ పర్యాటకుల దృష్టి లక్ష దీవులపై పడింది. ఈ విషయంలో మోడీ కత్తి పట్టకుండానే అనుసరించిన దౌత్య నీతితో ఒక విధంగా మాలే ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది.

ఇప్పుడు తాజాగా ఏడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా కూడా మోడీ ఇదే స్ట్రాటజీని ఫాలో కావడం గమనార్హం. ఏడు దశల ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎలక్షన్ క్యాంపెనింగ్ ముగిసిన వెంటనే ఆయన కన్యాకుమారి వెళ్లిపోయారు. దాదాపు 45 గంటల పాటు అక్కడే స్వామి వివేకానంద విగ్రహం వద్ద ధ్యాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే మోడీ చేపట్టిన ఈ కార్యక్రమంపై ఇండియా కూటమి రాజకీయ భాగస్వామిక పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఎన్నికల ముగిసినప్పటికీ మోడీ ఇలాంటి పొలిటికల్ స్టాంట్లు చేయడమేంటని ప్రశ్నించాయి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా మోడీ హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేశారు. అది అప్పట్లో మీడియాలో బాగా పబ్లిసిటీ వచ్చింది. తాజాగా ఏడో దశ ప్రచార పర్వం ముగిసినప్పటికీ ఆయన ధ్యానం పేరుతో ఎలక్షన్స్ ప్రభావితం చేసేలా ప్రయత్నం చేయడం గమనార్హం. అయితే మోడీ ధ్యానం చేసినప్పటికిని అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చే అవకాశాలే లేవు. అయితే మోడీ చేసిన ధ్యానం వల్ల మాత్రం పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలలో ఎన్నికల పోలింగ్ పై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. మొత్తంగా మోడీ ఏది చేసిన పరోక్షంగా ప్రత్యర్థి కుంభస్థలాలను మాత్రం కొట్టగలరని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper