spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేనాని పవన్ తెలుగునాట కోట్లాది మంది ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు. చిన్న పిల్లల నుంచి పండుటాకుల వరకూ ఆయనకు హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయాలంటే బొత్తిగా పడని వారు సైతం పవన్ జనసేన ఆవిర్భావం నుంచి అతడితో అడుగులు వేస్తున్నారు. పవన్ తన చర్యలు, ప్రసంగాలతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అందుకే పవన్ సినిమా, రాజకీయ రంగాలను సమ ప్రాధాన్యమిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే పవన్ అభిమానులకే ఎక్కువ సమయాన్నికేటాయిస్తారు. తాజాగా ఆయన ఓ కేన్సర్ బాధితుడికి విలువైన సమయాన్ని వెచ్చించారు. అతడి చివరి కోరికను తీర్చారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జనసైనికులు, అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసి తమ అభిమాన నాయకుడికి అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం రామేశ్వరానికి చెందిన సత్తిబాబు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఫ్యాన్స్ అసోసియేషన్ లో యాక్టివ్ గా పనిచేసేవారు. అటు జనసేన ఆవిర్భావం తరువాత పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసేవారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ ల్లో చికిత్స కూడా చేసుకున్నారు. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. తనకు పవన్ తో ఒకసారి కలవాలనుందని.. ఆయనతో ఫొటోలో దిగాలని ఉందని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు జనసేన నాయకులకు చెప్పగా.. వారు పవన్ ను సంప్రదించారు. దీంతో జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో కాకినాడ నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో సత్తిబాబును మంగళగిరి పార్టీ కార్యాలయానికి తెచ్చారు. విషయం తెలుసుకున్న పవన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి సత్తిబాబును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో ఫొటో దిగి కోరికను నెరవేర్చారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానానికి హ్యాట్సాప్ అంటూ జన సైనికులు, అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సినీ, రాజకీయ రంగాల్లోక్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కార్యకర్తలు, అభిమానులపై చూపుతున్న ప్రేమ ఇది అంటూ జన సైనికులు సగర్వంగా చెబుతున్నారు. విపరీతమైన స్టార్ డమ్ ను వదులుకొని రాజకీయరంగంలో అడుగుపెట్టిన పవన్ కు ఇది కొత్తకాదు. ఉద్దానం కిడ్నీ బాధితులనే అక్కున చేర్చుకున్నారు. వంశధార నిర్వాసితులకు అండగా నిలబడ్డారు. నిత్యం రాకాసి అలలతో జీవన యుద్ధం చేసే మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు పవన్ ఆలోచనలు, చర్యలు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper