Homeజాతీయ వార్తలుModi Latest Speech: నిన్న బంగారం .. నేడు స్కూళ్లు ,ఆఫీసులు బంద్‌ చేయాలి.. మోదీ...

Modi Latest Speech: నిన్న బంగారం .. నేడు స్కూళ్లు ,ఆఫీసులు బంద్‌ చేయాలి.. మోదీ పిలుపు వెనుక భయాందోళనలు

Modi Latest Speech: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇందులో ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు. ఇది కీలకంగా మారింది. ఇంధన వినియోగం తగ్గించాలని, ఎరువులు పొదుపుగా వాడాలని విదేశీ మారక నిల్వలను రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. తాజాగా ఆయన పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు బోధించాలని సూచించారు. ఈ మార్పులు వెనుక ఏ భయాందోళనలు ఉన్నాయి. బంగారం నుంచి […]

Modi Latest Speech: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇందులో ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చారు. ఇది కీలకంగా మారింది. ఇంధన వినియోగం తగ్గించాలని, ఎరువులు పొదుపుగా వాడాలని విదేశీ మారక నిల్వలను రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు. తాజాగా ఆయన పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు బోధించాలని సూచించారు. ఈ మార్పులు వెనుక ఏ భయాందోళనలు ఉన్నాయి.

బంగారం నుంచి బడి వరకు..
దేశంలో ఏడాదిపాటు బంగార కొనొద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు మోదీ. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని ఆయన సూచించారు. తాజాగా స్కూళ్లకు ఆన్‌లైన్‌ క్లాసులు చేపట్టాలని సూచించారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్, చారిటీ స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాసులకు షిఫ్ట్‌ అవ్వాలని మోదీ సూచించారు. కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వాలని తెలిపారు.

మోదీ భయాందోళనలకు కారణం..
మోదీ పిలుపు వెనుక పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉంది. ఇంధనాన్ని ఆదా చేయాలని ఇటీవల ప్రధాని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ పరిస్థితులు ఇంధన ధరలను పెంచాయి, దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని మోదీ భయాందోళన చెందుతున్నారు.

ఆర్థిక రక్షణ వ్యూహం..
మోదీ పిలుపు ఆర్థిక రక్షణ వ్యూహంలో భాగం. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం మిగులుతుంది. రైతులు సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యతరగతి వారు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆన్‌లైన్‌ క్లాసులతో ఇంధన ఆదా చేయడానికి చర్య. బస్సులు, కార్లు ఉపయోగించకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్‌ వినియోగం తగ్గుతుంది. వర్క్‌ ఫ్రం హోం కారణంగా ఇంధనం భారీగా మిగులుతుంది.

మొత్తంగా మోదీ పిలుపులు దేశ ఆర్థిక రక్షణ కోసం చర్యలు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో ఈ చర్యలు అవసరం. పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. దీని నుండి రక్షించడానికి మోదీ చర్యలు తీసుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper