spot_img
Homeజాతీయ వార్తలుTRS MLAs Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆంధ్రా ఎంపీకి లింకులు.. ఆర్‌ఆర్‌ఆర్‌కు...

TRS MLAs Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆంధ్రా ఎంపీకి లింకులు.. ఆర్‌ఆర్‌ఆర్‌కు సిట్‌ నోటీసులు

TRS MLAs Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ సిట్‌ దూకుడుగా వెళ్తోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో, ఆయన దిశా నిర్దేశం మేరకే దర్యాప్తు జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ టార్గెట్‌గా జరుగుతున్న సిట్‌ దర్యాప్తు.. గురువారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీలో లింకులు ఉన్నట్లు గుర్తించిన సిట్‌.. ఆ ఎంపీకి నోటీసులు 41ఏ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తులో ఇది కీలక పరిణామం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

TRS MLAs Purchase Case
TRS MLAs Purchase Case

-ఆరోపణల నుంచి దారి మళ్లించేందుకేనా..
సిట్‌ దర్యాప్తు పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంలోనే జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సిట్‌ ఏర్పాటు చేయకముందు కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లలో ఎవరెవరి పేర్లు చెప్పారో.. వారికే సిట్‌ నోటీసులు ఇవ్వడం కూడా బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేపట్టిన విచారణలోనూ సిట్‌ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సిట్‌ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుందని నిరూపించుకునేందుకు.. ఏపీ ఎంపీని ఇందులోకి లాగినట్లు తెలుస్తోంది.

-రఘురామకు నోటీసులు..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌.. విచారణలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు 41ఏ కింద నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని కోరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులను రఘురామ గతంలో కలిశారని దర్యాప్తులో గుర్తించినందున ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రఘురామ ఇప్పటి వరకు స్పందించలేదు.

TRS MLAs Purchase Case
Raghu Rama Krishna Raju

-జగన్‌పై ధిక్కార స్వరం..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు 2019లో వైసీపీ టికెట్‌పై భీమవరం నుంచి విజయం సాధించారు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన జగన్‌పై ధిక్కార స్వరం వినిపించారు. పార్టీకి దూరంగా ఉంటున్నా. బీజేపీ, టీడీపీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వైసీపీ జారీచేసిన షోకాజ్‌ నోటీసులపై సంచలన రీతిలో స్పందించిన తర్వాత.. చాలా కాలంగా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని గతంలో వైసీపీ ఎంపీ రఘురామపై ఆరోపణలు చేసింది. దీంతో ఎంపీ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం, షోకాజ్‌ నోటీసులూ అందుకోవడం జరిగింది. తాజాగా తెలంగాణ సిట్‌ ఎంపీకి నోటీసులు ఇవ్వడంతో బీజేపీతో రఘురామ సాన్నిహిత్యం కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper