
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్యాస్ లీక్ ఘటనతో ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పశువులు కూడా పెద్ద ఎత్తున మృతి చెందాయి. తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద గ్రామస్థులు ధర్నా చేస్తున్నారు. అప్పటికే అక్కడ విదుల్లో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్ఫుకునే యత్నం చేసినా వారు ఆగకుండా పరిశ్రమ వైపు దూసుకెళ్లారు.
బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?
అదేవిధంగా ఆ పరిశ్రమను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించే వరకు తమ ఆందోళనను విరమించబోమని గ్రామస్థులు మీడియాకు తెలిపారు.
ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?
మరోవైపు పరిశ్రమ వద్దకు కాసేపట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ రానున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించి, గ్యాస్లీక్ ఘటనలో అస్వస్థతకు గురయిన పోలీసులను ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొనడం గమనార్హం. వందలాది మంది స్థానికులు పరిశ్రమ వద్దకు చేరుకుంటున్నారు. తమను అడ్డుకుంటున్న పోలీసులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిశ్రమ పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.