వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలో సాయిపల్లవి పాత్రపై తొలి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు విన్పించాయి. అందుకు తగ్గట్టుగా నేడు చిత్రబృందం సాయిపల్లవి సర్ప్రైజింగ్ లుక్ విడుదల చేసింది. అడవిలో అమరవీరుల స్థూపం వద్ద మెరూన్ కలర్ లంగావోణిలో తీక్షణంగా చూస్తూ కన్పిస్తుంది. ఆమె పాత్ర సినిమాకు ఎంతో కీలకమో ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ దాదాపు పూర్తి దశకు చేరుకుంది.
లాక్డౌన్ ముగిశాక మిగతా భాగం కాంప్లీట్ చేసి రిలీజ్ తేదిని ప్రకటించనున్నారు. ఈ మూవీలో నందితా దాస్, ప్రియమణి కూడా నటిస్తున్నారు. ఈ మూవీని సురేష్ బాబు, చురుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చి మూవీపై భారీ అంచనాలను పెంచడంలో చిత్రబృందం సక్సస్ అయిందనే చెప్పొచ్చు.