spot_img
Homeజాతీయ వార్తలుCM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?

CM KCR- Governor Tamilisai: ఢిల్లీకి చేరిన సీఎం, గవర్నర్ పంచాయితీ?

CM KCR- Governor Tamilisai: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఢిల్లీ వేదికగా కేసీఆర్ విషయం తేల్చాలని గవర్నర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆమె హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సీఎం ఢిల్లీలో ఉండగానే గవర్నర్ హోంమంత్రితో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై అమిత్ షా ఏమేరకు స్పందిస్తారో తెలియడం లేదు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్ అమిత్ షాకు నివేదిక అందజేశారు. గవర్నర్ పాత్రను తగ్గిస్తూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే ముగించారని ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్ కు అమిత్ షా ఏం షాక్ ఇస్తారో అంతుబట్టడం లేదు.

CM KCR- Governor Tamilisai
CM KCR- Governor Tamilisai

మొత్తానికి కేసీఆర్ వ్యవహారం మాత్రం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇన్నాళ్లు ఏదో అని సర్దుకుపోయిన గవర్నర్ ఇక పోరు బాట పట్టారు. ఉపేక్షించేది లేదని పార్టీ పెద్దలకు కేసీఆర్ తీరుపై నివేదిక అందజేశారు. ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. దీనికి అధికారిక పర్యటనగా చూపిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నా లెక్క చేయడం లేదు. దీంతో భవిష్యత్ లో కేసీఆర్ కు ఇక కష్టాలే అని తెలుస్తున్నాయి.

Also Read: CM Jagan Delhi Tour: సీఎం జగన్ లో కనిపించని జోష్.. ఢిల్లీ పర్యటన తుష్

గవర్నర్ ను కావాలనే పక్కన పెట్టడంతో ఆమెకు ఆగ్రహం కలుగుతోంది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన తనకు గౌరవం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఢిల్లీలో పెద్దలను కలిసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గవర్నర్ అంటే ఎంతటి గౌరవం ఇస్తారో పక్క రాష్ట్రాల వారిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. కావాలనే దురుద్దేశంతో పార్టీ నేతలు కూడా గవర్నర్ ను లెక్కలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.

CM KCR- Governor Tamilisai
CM KCR- Governor Tamilisai

ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ వ్యవహారంలో కలుగజేసుకుని కేసీఆర్ ను వివరణ కోరే అవకాశం ఉంది. ఎందుకు గవర్నర్ పై అక్కసు ఎందుకు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలియడం లేదు. మొత్తానికి కేసీఆర్ పై యుద్ధానికే గవర్నర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాబోయే కాలంలో ఇంకా మార్పులు ఎలా చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.

Also Read:AP Cabinet Reshuffle: కొత్త మంత్రివర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper