బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? చట్టం అమలు చేయడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ అసమర్థతతోనే బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం వల్లే అరాచకాలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. శిక్ష విధించేందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ ఈ విషయంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ తీరును వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు.
మహిళలపై ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? వారిపై ఏ మేరకు శిక్షలు పడుతున్నాయి అనే విషయాలు టీడీపీ లెక్కలతో సహా వెల్లడిస్తోంది. దీనికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ సైతం లోకేష్ డెడ్ లైన్ పెట్టడంతో ఆయనకేం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న కేసుల విషయంలో కోర్టులున్నాయని చెబుతున్నారు.
దిశ చట్టం అమలులో ఉండగా నేరాలు పెరిగిపోతున్నాయని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చట్ట ప్రకారం 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడాలని సూచిస్తున్నా ఇంతవరకు ఎంత మందికి శిక్షలు పడ్డాయని అడుగుతున్నారు. రమ్య హత్య విషయంలో కూడా ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు వెళుతోంది అని వాపోతున్నారు. చట్టం పకడ్బందీగా అమలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం అని అడుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది మరోలా ఉందని విమర్శిస్తున్నారు. రమ్య హత్య కేసులో సాధ్యమైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చూడాలని కోరుతోంది.