దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు 11 గంటల సమయంలో నష్టాల్లోకి జారుకున్నాయి. కొద్దిసేపట్లోనే ఐటీ రంగం నుంచి లభించిన అండతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 55,55 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల ఎగబాకి 16,496 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.19 వద్ద నిలిచింది.