Homeఆంధ్రప్రదేశ్‌Daggubati Purandeswari: ఎయిర్ ఇండియాలో పురంధేశ్వరి స్కాం చేసిందా? ప్రచారంలో నిజమెంత?

Daggubati Purandeswari: ఎయిర్ ఇండియాలో పురంధేశ్వరి స్కాం చేసిందా? ప్రచారంలో నిజమెంత?

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిపై వైసిపి దాడి ముమ్మరం చేసింది. బిజెపి అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అప్పులతో పాటు అవినీతిపై పురందేశ్వరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ సైతం పురందేశ్వరిపై ఎదురు దాడి చేస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఆమెను టార్గెట్ చేసుకున్నారు. పురందేశ్వరి గురించి తాను నోరు తెరిస్తే.. ఆమె తల ఎక్కడ పెట్టుకుంటారో.. ఏం చేసుకుంటారో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అందుకు తగ్గట్టుగానే రోజుకో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అవి చర్చనీయాంశంగా మారాయి.

బిజెపిలో చేరిన పురందేశ్వరి ఆ మధ్య ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఓ పదవి చేపట్టారు. ఆ విమానయాన సంస్థ అమ్మకంలో పురందేశ్వరి మధ్యవర్తిగా వ్యవహరించారని.. భారీగా ముడుపులు తీసుకున్నారని విజయసాయిరెడ్డి తాజాగా ఆరోపించారు.దీనిపై విజయసాయిరెడ్డి ఒక చర్చను తెర లేపారు. అయితే దీని వెనుక బిజెపి నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బిజెపి నేతలు ఇచ్చిన సమాచారం తోనే విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంతవరకు పురందేశ్వరి ఆ పదవి చేపట్టినట్లు ఎవరికీ తెలియదు. కానీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఆరోపణలతో ఆమె ఆ పదవి చేపట్టినట్లు అందరికీ తెలిసింది. అయితే ఈ ఆరోపణల్లో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇటీవల పురందేశ్వరి ఏపీ మద్యం విధానం పై, మద్యం కుంభకోణం పై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సైతం విజయ్ సాయి రెడ్డి సరికొత్త ఆరోపణలు చేశారు. మీ భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్, గీతం భరత్ మద్యం సిండికేట్ బ్రోకర్లతో బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఖరీదైన జిల్లాను ఎలా నిర్మిస్తున్నారని? దానికి ఖర్చు పెడుతున్నది ఎవరని ప్రశ్నించారు.దీంతో ఈ వివాదం మరింత పెరుగుతోంది. దీనిపై పురందేశ్వరి ఎలా స్పందిస్తారో చూడాలి.

బిజెపి పెద్దలతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిపై నేరుగా ఆరోపణలు చేస్తుండడం విశేషం. ఇంత చేస్తున్న విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలకు సైతం ఫిర్యాదు చేసి ఉంటారని తెలుస్తోంది. అయితే వైసీపీ సర్కార్ పై పురందేశ్వరి దూకుడును కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే విజయసాయిరెడ్డి ఈతరహా ఆరోపణలకు దిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా తమ పార్టీ అధ్యక్షురాలు పైనే వైసీపీ నేత ఆరోపణలు చేసినా.. తోటి బిజెపి నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. బిజెపిలోని ఓపక్షం విజయ్ సాయి రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోందని.. దాని ఫలితంగానే ఆయన ఈ తరహా ఆరోపణలు చేయగలుగుతున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే బిజెపి కేంద్ర పెద్దల విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి.. ఇక్కడ మాత్రం పురందేశ్వరిని టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version