Homeజాతీయ వార్తలుDeputy CM Ajit Pawar Passed Away: ఘోర ప్రమాదం.. డిప్యూటీ సీఎం దుర్మరణం!

Deputy CM Ajit Pawar Passed Away: ఘోర ప్రమాదం.. డిప్యూటీ సీఎం దుర్మరణం!

Deputy CM Ajit Pawar Passed Away: ఘోర ప్రమాదం ఇది. మాటలకు అందని విషాదం ఇది. చూస్తుండగానే దారుణం జరిగిపోయింది. అప్పటిదాకా గాలిలో విహరిస్తున్న వారంతా ఒక్కసారిగా విగత జీవులుగా మారిపోయారు. చనిపోయిన వారిగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు.. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అజిత్ పవార్(66). ఈయన ఎన్సిపి నేత కూడా. మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ […]

Deputy CM Ajit Pawar Passed Away: ఘోర ప్రమాదం ఇది. మాటలకు అందని విషాదం ఇది. చూస్తుండగానే దారుణం జరిగిపోయింది. అప్పటిదాకా గాలిలో విహరిస్తున్న వారంతా ఒక్కసారిగా విగత జీవులుగా మారిపోయారు. చనిపోయిన వారిగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు.. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అజిత్ పవార్(66). ఈయన ఎన్సిపి నేత కూడా. మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో ల్యాండింగ్ అవుతున్న క్రమంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు ఐదుగురు మరణించారు. ఈ విషయాన్ని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

అజిత్ పవార్ బారామతి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలో బుధవారం బహిరంగ సభ జరగాల్సి ఉండగా.. అక్కడికి వెళ్లడానికి ఆయన విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ ఉదయం 8 గంటల 45 నిమిషాల సమయంలో ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైంది.

విమానం కూలిపోయిన వెంటనే భారీగా మంటలు వచ్చాయి. ఆ సమయంలో అజిత్ పవార్, ఆయన సిబ్బంది దాదాపు ఆరుగురు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రికి మృత దేహాలను తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత పవార్ భార్య సునేత్ర, వెంటనే బారామతి వెళ్లిపోయారు. అజిత్ పవార్ మృతి నేపథ్యంలో మహారాష్ట్రలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

అజిత్ పవార్ మహారాష్ట్రలో కీలకమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించిన శరద్ పవార్ కు సోదరుడి కుమారుడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన.. ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల శరద్ పవార్ తో దూరం జరిగారు. ఎన్సిపి మరో వర్గాన్ని ఏర్పాటు చేశారు. మహాయుతి అనే కూటమిలో చేరారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. క్రీడలు, ఆర్థిక, ప్రణాళికలు, మైనారిటీ వంటి శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper