Homeఆంధ్రప్రదేశ్‌మృతదేహంలో కరోనా ఎంత సమయం ఉంటుందో తెలుసా?

మృతదేహంలో కరోనా ఎంత సమయం ఉంటుందో తెలుసా?


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తోంది. కరోనా దాటికి ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవడంతో ఫ్యామిలీతో సంబంధాలు మళ్లీ దగ్గరయ్యాయి. అయితే కరోనా పాజిటివ్ వస్తే మాత్రం మానవత్వం మంటగిలిసేలా ప్రతీఒక్కరూ దూరంగా జరుగుతున్న సంఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి.

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

కరోనా పాజిటివ్ సోకగానే ఆ వ్యక్తిని అంటరానివాడిగా చూస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కన్నపేగు బంధం కూడా దూరమవుతోంది. భార్యభార్తలు, తల్లి కొడుకులు, తండ్రి కూతుళ్ల బంధం సైతం కరోనా కారణంగా విడిపోతున్న సంఘటనలు నిత్యం వార్తల్లోనే చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కోటి మార్కును దాటేశాయి. మరణాల సంఖ్య కూడా భారీగా ఉంది. అయితే ఇటీవలీ కాలంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది.

ఇదిలా ఉంటే కరోనాతో మృతిచెందిన వారికి కనీస దహన సంస్కారాలకు కూడా నోచుకోవడం లేదు. వారి మృతదేహాలను అనాథశవాల్లా సాగనంపుతుండటం సోషల్ మీడియాల్లోనే వైరల్ అవుతూనే ఉన్నాయి. కరోనాతో మృతిచెందే వారికి చివరిచూపు కూడా కరువవుతోంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు దూరంగా జరుగుతున్నారు. కరోనా మృతదేహన్ని తాకితే తమకు కూడా ఎక్కడ సోకుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!

దీంతో కరోనా వైరస్ మృతదేహంలో ఎంతకాలం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది.దీనిని తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే మృతదేహం నుంచి కరోనా వ్యాపించే అవకాశం చాలా తక్కువ ఉన్నాయట. ఒక వ్యక్తి చనిపోయాక అతడి మృతదేహంలో కరోనా వైరస్ ఆరుగంటలు మాత్రమే బతికి ఉంటుందట. ఆ తర్వాత మృతదేహం నుంచి కరోనా వ్యాపించదని తాజాగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహార్ రెడ్డి వెల్లడించారు.

ఇటీవల చాలాచోట్ల కరోనాతో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు చేయకుండా స్థానిక ప్రజలు అడ్డకుంటారని చెప్పారు. కరోనాపై అవగాహన పెంచుకోకుండా కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు చేయకుండా అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇకనైనా కరోనా మృతదేహాలకు కనీస దహన సంస్కార మర్యాదలు దక్కుతాయని ఆశిద్దాం..

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version