Homeఆంధ్రప్రదేశ్‌AP CM Y S Jagan: ఏపీ సీఎం జగన్ కు షాకిచ్చిన కోర్టు..

AP CM Y S Jagan: ఏపీ సీఎం జగన్ కు షాకిచ్చిన కోర్టు..

AP CM Y S Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేసులు కొత్తేమీ కాదు. ఇదివరకే ఆయనపై పలు కేసులు పెండింగులో ఉన్నాయి. దీంతో ఆయన కేసులకు భయపడకుండానే ముందుకు వెళ్తున్నారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సమన్లు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. 2014లో జరిగిన తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలపై సమన్లు జారీ చేయడం గమనార్హం.

Court Shock To AP CM Jagan
Jagan

ఈ నెల 28న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేతల్లో ఆందోళన మొదలైంది. జగన్ పై అక్రమాస్తుల కేసుతో పాటు పలు కేసులు సీబీఐ కోర్టులో పెండింగులో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపై చాలా కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ కేసులో సమన్లు జారీ కావడంతో వైసీపీ నేతలు భయాందోళన చెందుతున్నారు.

Also Read: RRR Movie Ticket Prices: ఆర్ఆర్ఆర్ థియేట‌ర్ల ఓన‌ర్ల‌కు షాక్‌.. ఏపీలో రంగంలోకి రెవెన్యూ అధికారులు..

2014 లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిలపై ఈసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం కోర్టులు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్ తోపాటు మిగతా ఇద్దరికి సమన్లు జారీ చేయడం తెలిసిందే. ఇప్పటికే కొనసాగుతున్న కేసులతోపాటు ఇది కూడా వాటి వరుసలో చేరుతుంది.

ఎన్నికల కోడ్ విషయంలో అప్పుడు జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని కోర్టు సమన్లు జారీ చేయడంతో ఇప్పుడు వారు కోర్టుకు హాజరు కాక తప్పదు. దీనిపై కూడా వాదనలు పూర్తయ్యాక కేసు పరిష్కారం కావడానికి ఇంకెంత సమయం పడుతుందో తెలియదు. మొత్తానికి జగన్ మెడలో కేసుల హారం దండలా మారుతున్నాయి కేసులు. ఎప్పటికి పరిష్కారమయ్యేనో చూడాలి మరి.

Also Read: IT Raids Tension In TRS: టీఆర్ ఎస్ నేత‌ల్లో ఐటీ దాడుల గుబులు.. కేంద్రం గ‌ట్టిగానే డిసైడ్ అయిందా…?

Recommended Video:

RRR Movie USA Review | RRR USA Premiere Show Review | Ram Charan | JR NTR | Oktelugu Entertainment

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] India- China: డ్రాగ‌న్ దేశం చైనా స‌రిహ‌ద్దుల్లో కొద్ది రోజులుగా క‌వ్వింపు చ‌ర్య‌లకు పాల్ప‌డ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. 2020లో గాల్వాన్‌లో చోటుచేసుకున్న ఘ‌ర్ష‌న‌లు, తూర్పు ల‌డ‌ఖ్‌లో స‌రిహ‌ద్దు ప్ర‌తిష్టంబ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌నపై గంట‌ల త‌ర‌బ‌డి స‌స్పెన్స్ నెల‌కొంది. అస‌లు ఆయ‌న వ‌స్తారో.. లేదో..? అన్న సందేహం త‌లెత్తింది. చివ‌ర‌కు ఆయ‌న భార‌త్‌కు వ‌చ్చారు. కాగా ఆయ‌న చైనా విదేశాంగ మంత్రి ప‌ర్య‌ట‌న అధిక ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. […]

Comments are closed.

Exit mobile version