spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Family: ప్రజల్లోకి చంద్రబాబు ఫ్యామిలి.. వర్కౌట్ అవుతుందా?

Chandrababu Family: ప్రజల్లోకి చంద్రబాబు ఫ్యామిలి.. వర్కౌట్ అవుతుందా?

Chandrababu Family: ఈసారి గట్టిగా కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2024 ఎన్నికలు టిడిపికి చావో రేవో అన్న మాదిరిగా మారడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందుకుగాను కుటుంబ సభ్యులను రంగంలోకి దించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ఏకకాలంలో ముగ్గురు రాష్ట్రాన్ని చుట్టేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే భువనేశ్వరి ప్రజల మధ్యకు వచ్చారు. ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించనున్నారు. అటు లోకేష్ సైతం తాను పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

ఈ నెలలోనే రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో పర్యటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. 24 రోజుల్లో 25 బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు బహిరంగ సభల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం విశేషం. ఈ సభల ద్వారా టిడిపి తో పాటు జనసేన కేడర్ కు చంద్రబాబు దిశా, నిర్దేశం చేయనున్నారు.మరోవైపు సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు పై సైతం దృష్టి పెట్టనున్నారు.

మరోవైపు మంగళగిరిలో లోకేష్ పర్యటిస్తున్నారు. సంక్రాంతి వరకు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను లోకేష్ తిరగనున్నారు.స్థానిక నాయకులు, క్యాడర్ తో మండలాల వారీగా లోకేష్ సమీక్షించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఓడిపోయారు. ఈసారి కూడా లోకేష్ ను ఎలాగైనా ఓడించాలని జగన్ భావిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని రంగంలోకి దించారు. దీంతో లోకేష్ అప్రమత్తమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా తటస్తులను కలుసుకొని మద్దతు కూడగడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి పరామర్శలకు దిగిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సుదీర్ఘ కాలం పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మనస్థాపానికి గురైన చాలామంది టీడీపీ అభిమానులు ప్రాణాలు వదిలారు. వారిని పరామర్శించేందుకు నిజం గెలవాలి పేరిట భువనేశ్వరి అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. సరిగ్గా విజయనగరం జిల్లాలో ఆమె ఉండగా చంద్రబాబుకు బెయిల్ లభించింది. దీంతో అప్పట్లో యాత్రను నిలిపివేసి రాజమండ్రి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో పరామర్శ యాత్రను ప్రారంభించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో బాధిత కుటుంబాల వారిని పరామర్శించనున్నారు.

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కుటుంబ సభ్యులను రంగంలోకి దించడం విశేషం. కుటుంబం మొత్తం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. గత ఎన్నికలకు ముందు జగన్ ఇదే మాదిరిగా కుటుంబం మొత్తాన్ని రంగంలోకి దించారు. ఇప్పుడు దానిని గుర్తు చేస్తూ చంద్రబాబు ఫ్యామిలీ మొత్తాన్ని రంగంలోకి దించి ప్రజా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తుండడం విశేషం. అయితే ఈ ప్రయత్నంలో చంద్రబాబు ఎంతవరకు సఫలీకృతులు అవుతారో చూడాలి.అయితే జనసేన తో పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల శ్రేణులు ఉరకలేసిన ఉత్సాహంతో పని చేస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version