spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP-Telangana Politics: విశాఖపై బీజేపీ ఫోకస్.. తెరవెనుక రాజకీయం ఏంటి?

AP-Telangana Politics: విశాఖపై బీజేపీ ఫోకస్.. తెరవెనుక రాజకీయం ఏంటి?

AP-Telangana Politics: భారతీయ జనతా పార్టీ దక్షిణాది స్టేట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాదిలో పట్టున్న పార్టీ కావడంతో దక్షిణాదిపై కూడా ఓ కన్ను వేసింది. ఇప్పటికే తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ ఆంధ్రపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తన బలం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు గాను తన ఎంపీలను విశాఖకు పంపుతోంది. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలంటే ఎంపీలతో రాయబారం చేస్తోంది. అధిష్టానం ఆదేశాలను ఎంపీలు పాటిస్తూ విశాఖలో పర్యటిస్తూ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తోంది.

AP-Telangana Politics
AP-Telangana Politics

ఇన్నాళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీని ఎదుర్కోవాలని సిద్ధమవుతోంది. దీనికి పార్టీ ఎంపీలను వాడుకోవాలని చూస్తోంది. పార్టీకి రాజ్యసభ సభ్యులుండటంతో వారితో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరుసగా జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ లు విశాఖలో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలను హైలెట్ చేయాలని చూస్తున్నారు. దీంతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తన ప్రభావం చూపాలని భావిస్తున్నట్లు సమాచారం. విశాఖలో వైసీపీ ఉనికిని దెబ్బ తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణకు బీజేపీ సీఎంలు వరుసగా ఎందుకొస్తున్నారు?

రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఒక వైపు టీడీపీతో పొత్తు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుతం జనసేనతో స్నేహభావం చూపుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలుచేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానీయకుండా చేసేందుకే బీజేపీ సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

రాష్ర్టంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిన క్రమంలో బీజేపీ వైసీపీని అడ్డుకోవాలని చూస్తోంది. గతంలో జరిగిన బద్వేల్ ఎన్నికల్లో కూడా వైసీపీ దొంగ ఓట్లు వేయించిందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు అడ్డుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే రాష్ర్టంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: మీడియాలో రచ్చవుతున్న చంద్రబాబు ‘లవ్’ కామెంట్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper