Rashmika Mandanna: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్లో రణబీర్ కపూర్తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. పైగా క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుతో పాటు బోల్డ్ డైరెక్టర్ గా అనే పేరును కూడా నేషనల్ రేంజ్ లో తెచ్చుకున్నాడు. మొత్తానికి ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యం అయింది.

ఇక తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో తాజాగా ఈ సినిమాలో చిత్రబృందం హీరోయిన్గా రష్మికను కన్ఫర్మ్ చేశారు. నేడు ఉగాది సందర్భంగా చిత్ర నిర్మాతలు శ్రీవల్లికి స్వాగతం పలికారు.
Also Read: Crazy Update On RRR2: ‘ఆర్ఆర్ఆర్ 2’ పై క్రేజీ అప్ డేట్.. చర్చల్లో ఎన్టీఆర్
ఇప్పటికే పుష్పతో నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది రష్మిక. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె క్రేజ్ రెట్టింపు కానుంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ను దర్శకుడు ప్లాన్ చేయగా.. ఇందుకోసం పూజా హెగ్డేను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. రంగస్థలంలో స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసిన ఆమె.. ‘యానిమల్’ కోసం అంగీకరిస్తుందో? లేదో? చూడాలి మరి.
యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రణబీర్తో పాటు అనిల్ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అలాగే సీనియర్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ కపూర్ – రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ అంటే.. ఫుల్ క్రేజ్ ఉంటుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్ అని ప్రీ-లుక్ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ‘హీరో తన తండ్రిని తరువాతి జీవితంలో తన కొడుకుగా జన్మించమని .. ఆ తర్వాత మళ్ళీ తండ్రిగా జన్మించమని కూడా అడుగుతాడు. అంటే.. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. ఇక మునుపెన్నడూ రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నారని బాలీవుడ్ మీడియాలో బాగా టాక్ నడుస్తోంది.
Also Read:Mahesh Babu Rejected Pushpa: మహేష్ ‘పుష్ప’ను రిజెక్ట్ చేయడానికి కారణం అదే