spot_img
Homeఎంటర్టైన్మెంట్Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయంలో చిరంజీవి గౌరవం పెంచిన రామ్ చరణ్.. వీడియో వైరల్

Ayodhya Ram Mandir: అయోధ్య ఆలయంలో చిరంజీవి గౌరవం పెంచిన రామ్ చరణ్.. వీడియో వైరల్

Ayodhya Ram Mandir: చిరంజీవి కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది. టాలీవుడ్ నుండి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానం దక్కింది. చిరంజీవి ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి ఆహ్వానం లభించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు అయోధ్యకు రావాలంటూ ఆలయ కమిటీ ఆహ్వానించింది. చిరంజీవి కుటుంబంతో పాటు నేడు అయోధ్య వెళ్లారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకను స్వయంగా వీక్షించారు. చిరంజీవి, రామ్ చరణ్ లకు అడుగడునా ఘన స్వాగతం లభించింది.

అయోధ్య ఎయిర్ పోర్ట్ లో దిగగానే ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. శాలువాలు కప్పి గౌరవించారు. అనంతరం ఫోటోలు దిగారు. కాగా అయోధ్య మందిరంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖుల కోసం ఓ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన విఐపీ ల మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ చిరంజీవి, రామ్ చరణ్ లతో కాసేపు ముచ్చటించారు.

దీన్ని షూట్ చేస్తున్న నేషనల్ మీడియా కెమెరా మెన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన(చిరంజీవి) రామ్ చరణ్ తండ్రి అందుకే ఫ్రేమ్ లో పెట్టాను, అని అన్నారు.రామ్ చరణ్ తండ్రికి మించిన తనయుడు అయ్యాడని ఈ పరిణామం తెలియజేస్తుంది. నార్త్ ఇండియాలో ఆయన క్రేజ్ కి ఏది నిదర్శనం. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఫేమ్ ఎల్లలు దాటిన విషయం తెలిసిందే. హిందీలో కూడా ఆర్ ఆర్ ఆర్ మంచి విజయం సాధించింది.

ఈ క్రమంలో నార్త్ లో కూడా రామ్ చరణ్ కి అభిమానులు ఏర్పడ్డారు. అక్కడ నేషనల్ మీడియా అయోధ్యలో రామ్ చరణ్ ని ప్రత్యేకంగా కవర్ చేసింది. తండ్రి చిరంజీవి మెగాస్టార్ గా సౌత్ ఇండియాను షేక్ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ మొత్తం ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ఫ్యాన్స్ ని పలకరించనున్నాడు. తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version