Homeఎంటర్టైన్మెంట్Madhya Pradesh CM: ఎన్టీఆర్, ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం.. తెగ మురిసిపోతున్న...

Madhya Pradesh CM: ఎన్టీఆర్, ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం.. తెగ మురిసిపోతున్న ఫ్యాన్స్

Madhya Pradesh CM: ఈ మధ్య బాలీవుడ్ లో తెలుగు సినిమాల హవా విపరీతంగా పెరిగిపోతోంది. బాహుబలితో మొదలైన పాన్ ఇండియా వేవ్.. ఆ తర్వాత పుష్ప క్రేజ్ తో పాటు.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ రూపంలో దేశం సినిమారంగాన్ని ఊపేస్తోంది. దీంతో ఇప్పుడు అందరూ తెలుగు సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తెలుగు సినిమాలపై సంచలన కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లో నిర్వహించిన తెలుగు సంగమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Madhya Pradesh CM
Madhya Pradesh CM

తెలుగు వారసత్వాన్ని, గౌరవాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా తెలుగు సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సినీ నటుడు అలీ, కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్యను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ప్రజలతో తెలుగు ప్రజలు మమేకమై జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాలపై ఆసక్తికర కామెంట్ చేశారు. తెలుగు సినిమాలు ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారాయని.. అక్కడి నుంచే పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: RRR 23 Days : ఇంకా అదే ఊపు.. కారణం అదే ?

బాహుబలి చూసి తామంతా ఫిదా అయ్యామని, అప్పటి నుంచి తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాలుగా మారాయన్నారు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తెలుగుజాతిని ప్రపంచం గుర్తించే విధంగా చేస్తే.. ఇప్పుడు ప్రభాస్ తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు కొత్త మార్గదర్శకంగా తెలుగు సినిమాలు మారాయని.. మిగతా ఇండస్ట్రీ వాళ్ళంతా తెలుగు సినిమాలను ఫాలో అవుతున్నారంటూ వివరించారు.

Madhya Pradesh CM
Ali

రానున్న రోజుల్లో తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాను మరింత ప్రభావితం చేస్తాయని గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు సినిమాల గురించి ఎంత గొప్పగా మాట్లాడటం విశేషంగానే చెప్పుకోవాలి. పైగా ఆయన తెలుగు ముఖ్యమంత్రి కూడా కాదు. అలాంటిది ఇంత బాగా తెలుగు సినిమాల గురించి ఆయన వివరించడం ఏంటని తెలుగు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ గురించి ఇంత గొప్పగా చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ అయితే తెగ మురిసిపోతున్నారు.

Also Read: Janasena: మత్స్యకారులకు ఆశాదీపంగా పవన్ కళ్యాణ్.. జనసేన వైపు గంగపుత్రుల చూపు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper