1992. అక్టోబర్ 25 న విడుదలై ఘన విజయం సాదించిన కమల్ హాసన్ చిత్రం తేవర్ మగన్ {తెలుగులో క్షత్రియ పుత్రుడు } ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దాన్ని నిర్మిస్తుంది మరెవరో కాదు సాక్షాత్తు ఆ చిత్ర కథానాయకుడు కమల్ హాసనే. తలైవన్ ఇరుక్కిన్ డ్రాన్ పేరుతొ తెరకెక్క బోతున్న ఈ చిత్రం ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్సకత్వంలో సంగీత సొగసులు అద్దుకో బోతోంది. ఇక ఈ చిత్రం తో పాటు మరో చిత్రం కూడా సీక్వెల్ గా రూపొంద బోతోంది.
2006 వ సంవత్సరం లో కమల్ హాసన్ , కమలిని ముఖర్జీ జంటగా నిర్మించబడి సూపర్ హిట్ అయిన వెట్టై యాడు విలయాడు (తెలుగులో రాఘవన్ ) చిత్రం ఇపుడు సీక్వెల్ గా రాబోతుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ గత చిత్ర నిర్మాత ఇసారి గణేష్ నేతృత్వం లోనే నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్ర నిర్మాణానికి కూడా కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెల్సింది.
Confidence is strength