తన గత చిత్రం గ్యాంగ్ లీడర్ తో ఊహించని పరాజయం చవి చూసిన ఇక ముందు చేయబోయే చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. .నేచురల్ స్టార్ నాని ఫిబ్రవరి 25 న ” వి “చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు..ఇటీవల విడుదలైన టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇక ఈ చిత్రం తర్వాత నాని…టక్ జగదీష్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంది.నిన్నుకోరి చిత్రం మంచి విజయం అందుకొన్న నేపధ్యం లో టక్ జగదీష్ చిత్రం ఫై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం చేస్తూనే నాని మరో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేసాడు.
గతంలో విజయ్ దేవరకొండతో “టాక్సీవాలా”’ వంటి థ్రిల్లర్ చిత్రం తీసి హిట్ కొట్టిన రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. ఇదిలావుంటే ఈ చిత్రం కథని నాని 50 లక్షలకి కొనుగోలు చేసాడని తెలుస్తోంది.ఓ ఆడియో కంపెనీకి చెందిన వ్యక్తి దగ్గర నాని ఈ కథని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కొనుగోలు చేసిన కథే అయినా మార్పులు అవసరమని నాని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ పలు జాగ్రత్తలు సూచించాడట… ఏది ఏమైనా కథల విషయంలో నాని తీసుకొంటున్న జాగ్రత్తలు నానికి మరిన్ని విజయాలు తెచ్చి స్టార్ గా నిలబెట్టడం
ఖాయం అనిపిస్తోంది.
Sweet are the uses of adversity