Srinu Vaitla fraud case complaint details: సామాన్యులు మాత్రమే కాదు , ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు కూడా మోసాలకు గురి అవుతున్నారు. రీసెంట్ గానే ప్రముఖ డైరెక్టర్ తేజ కుమారుడు పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయిలు ఒక జంట నా చేత ఖర్చు చేయించి మోసం చేసారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా ఇలాంటి మోసానికి గురయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రాంతం లోని వికారాబాద్ జిల్లా పరిధిలో ఒక వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి నిందితులు ఒప్పందం చేసుకున్నారట. అందుకోసం శ్రీనువైట్ల సుమారుగా కోటి రూపాయిల వరకు నిందితులకు ఇచ్చారు. అయితే ఈ భూమి చాలా కాలం నుండే వివాదం లో ఉంది, కోర్టు లో దీనిపై విచారణ కూడా జరుగుతోంది. రీసెంట్ గానే ఈ వివాదం పై కోర్టు తుది తీర్పుని ఇస్తూ ఆ భూమి వేరే వ్యక్తులకు చెందినదిగా చెప్పుకొచ్చింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీను వైట్ల, తానూ కొన్న భూమి నిందితులది కాదని, మోసపోయానని , తనకు ఎలా అయినా న్యాయం చెయ్యాలంటూ శ్రీనువైట్ల హైదరాబాద్ CCS పోలీసులకు ఫిర్యాదు చేశాడు . ఈ మేరకు పోలీసులు కేసు ని నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రస్తుత మార్కెట్ వేల్యూ ప్రకారం చూస్తే ఈ భూమి విలువ అక్షరాలా 7 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని తెలుస్తోంది. మరి శ్రీనువైట్ల కి పోలీసులు, కోర్టు న్యాయం చేస్తుందా లేదా అనేది చూడాలి. కోటి రూపాయిలు తీసుకున్న నిందితులు ఇప్పుడు కనీసం తనకు స్పందించడం లేదని శ్రీను వైట్ల ఫిర్యాదు లో పేర్కొన్నాడట. ఒక స్థలం కొనుగోలు చేసేటప్పుడు ముందు వెనుక అన్ని విధాలుగా విచారించి కొనుగోలు చెయ్యాలి కానీ , అంత పెద్ద మొత్తం డబ్బులు ఎలా ఇలాంటి వివాదాస్పద భూముల్లో పెట్టగలిగారు అంటూ సోషల్ మిడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇక శ్రీను వైట్ల కెరీర్ విషయానికి వస్తే, ఒకప్పుడు టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలతో పని చేసి , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని మన ఆడియన్స్ కి అందించిన శ్రీను వైట్ల, ఇప్పుడు ఫేడ్ అవుట్ స్థాయిలో ఉన్నాడు. ఆయన చివరి చిత్రం గోపీచంద్ తో తీసిన ‘విశ్వం’ కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన శర్వానంద్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరూ శ్రీను వైట్ల తో ఒక్క సినిమా ఛాన్స్ కోసం క్యూలు కట్టేవారు. అలాంటి డైరెక్టర్ కి ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారు. భవిష్యత్తులో అయినా శ్రీను వైట్ల కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.