Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. నిన్న థియేటర్లో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా.. భారీ హిట్తో దూసుకెళ్లిపోతోంది. ఎక్కడ చూసినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినా.. చివరి నిమిషం వరకు సుకుమార్ ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టగలిగాడనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులతో అభిమానులు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రివ్యూలను కూడా ఇచ్చేస్తున్నారు. కాగా, తాజాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పుష్ప సినిమాపై చేసిన ఓ మీమ్ ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది.
Pushpa
Also Read: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్కు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈ మీమ్లో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ ఫొటోలను కలిపి రూపొందించారు. ఇందులో బన్నీ బైక్పై కూర్చుని అందరికీ హలో చెబుతున్నట్లుగా ఓ పోస్టర్ విడుదల చేయగా.. అదే ఫొటోను, సినిమాలో ఫహద్ ఫాజిల్ చెప్పే పార్టీ లేదా పుష్పా?.. డైలాగ్ను కలిపి మీమ్ను క్రియేట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మీమ్లో హెల్మెట్, మిర్రర్ లేవా పుష్ప?.. అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
ఇటీవల కాలంలో హెల్మెట్, సైడ్ మిర్రర్లు లేకుండా భద్రతా ప్రమాణాలు పాటించని వారిని ఉద్దేశిస్తూ.. ఇటువంటి వినూత్మమైన ఆలోచనతో సైబరాబాద్ పోలీసులు ప్రజల్లో చైతన్యం కలిగిసంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలను కూడా ట్రెండీగా ఉపయోగించుకుంటూ.. అసలు తగ్గేదేలే అంటున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. సునిల్, అనసూయ, రావురమేశ్లతో పాటు పలువురు కీలక నటులు ఇందులో కనిపించారు.
Also Read: సుక్కు – బన్నీ ‘పుష్ప 2’ను ఏం చేయబోతున్నారు ?