అశ్లీల చిత్రాల సృష్టికర్తగా పేరుప్రఖ్యాతలు సాధించిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసులో టాలీవుడ్ బ్యూటీ ‘ఫ్లోరా షైనీ’ పేరు వినిపించింది. ఈ భామ తెలుగులో ఆశా షైనీగా గుర్తింపు తెచ్చుకుంది లేండి. ఈమెగారి పేరు కూడా ఈ కేసులో బాగా బయటకు రావడంతో వెంటనే ఆశా అలెర్ట్ ఆయి సోషల్ మీడియాలో ఈ అంశం పై రియాక్ట్ అయింది. తన ఇన్స్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోలో ఈ అంశం పై వివరణ ఇస్తూ మొత్తానికి క్లారిటీ ఇచ్చింది.
ఆశా షైనీ మాటల్లోనే.. రాజ్ కుంద్రా ఫ్రెండ్ ఉమేశ్ కామత్ తో నాకు మంచి పరిచయం ఉంది. అయితే, నేను తనతో జరిపిన సాధారణ సంభాషణను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. అందుకే ఈ విషయం పై నిజం చెప్తున్నాను. నాకు ఉమేశ్ కామత్తో గానీ, అలాగే అశ్లీల చిత్రాల రాకెట్ కేసుతో గానీ నాకు ఏ విధమైన సంబంధాలు లేవు.
నా పై వస్తున్నవి అన్నీ వట్టి పుకార్లే అని అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. దయచేసి నన్ను సంప్రదించకుండా పైగా ఆ చాట్స్ అసలు నిజమైనవో కాదో తెలుసుకోకుండా మీ ఇష్టారీతిన ఆ ఎడిట్ చాట్ లను ప్రసారాలు చేయడం మంచిది కాదు. నిజానికి గతంలో నేను ఎప్పుడూ రాజ్ కుంద్రాతో అసలు మాట్లాడింది కూడా లేదు. అలాంటప్పుడు నేను అతనితో బిజినెస్ ఎలా చేస్తాను ?
అయితే, ఒక్కటి మాత్రం నిజం. రాజ్ కుంద్రా క్యాస్టింగ్ టీమ్ గతంలో నాకు చాలాసార్లు ఫోన్లు చేశారు. పలు మార్లు నాకు హాట్ షాట్స్ యాప్ కోసం రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించమని అడిగారు. అయితే, నేను మాత్రం అలాంటి అశ్లీల చిత్రాలలో నటించలేను అంటూ చెప్పాను. కాబట్టి ఆ అశ్లీల చిత్రాల రాకెట్ లో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. దయచేసి ఈ కేసులో నన్ను ఇన్ వాల్వ్ చేయొద్దు’ అంటూ ఆవేదన చెందింది.