Karthika Deepam: మొండి పట్టు వదలని మోనిత.. మోనిత దెబ్బకు దిగొచ్చిన సౌందర్య, కార్తీక్..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత పురిటి నొప్పులతో బాధపడుతూ హాస్పిటల్ కి చేరింది.అయితే ఇదే విషయాన్ని భారతీ కార్తీక్ కు ఫోన్ చేసి చెప్పగా తనకు నాకు ఏంటి సంబంధం తన చస్తే చావని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత భారత్ కి మరొక సారి ఫోన్ చేసి నువ్వు వస్తే కాని ఆపరేషన్ చేయించుకున్న అంటుంది కార్తీక్ నువ్వు […]

Written By: Navya, Updated On : October 26, 2021 11:13 am
Follow us on

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత పురిటి నొప్పులతో బాధపడుతూ హాస్పిటల్ కి చేరింది.అయితే ఇదే విషయాన్ని భారతీ కార్తీక్ కు ఫోన్ చేసి చెప్పగా తనకు నాకు ఏంటి సంబంధం తన చస్తే చావని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత భారత్ కి మరొక సారి ఫోన్ చేసి నువ్వు వస్తే కాని ఆపరేషన్ చేయించుకున్న అంటుంది కార్తీక్ నువ్వు రా అంటూ చెప్పడంతో కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ సమయంలో సౌందర్య తనకు ఏమైనా నేను బాధపడను కార్తీక్.. అభం శుభం తెలియని చిన్నారి ప్రమాదంలో పడడం.. ఆ పసి బిడ్డ చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నిస్తుంది. ఎవరిపై నువ్వు జాలి పడుతున్నావ్ మమ్మీ అని ప్రశ్నించగా అంతలో దీప టీ తీసుకొని మెట్లపై వస్తుంది.చూస్తూ చూస్తూ ఆ పసి ప్రాణాన్ని ఎలా వదులుకుంటాము రా పెద్దోడా అంటూ ఉండగా దీప రావడాన్ని గమనించిన సౌందర్య కావాలని కార్తీక్ ను తాకుతూ తను వచ్చినట్టు చెబుతుంది. దీంతో వీరిద్దరూ అలర్ట్ అవుతూ లాయర్ ఫోన్ చేశాడంటూ సౌందర్య మాట మారుస్తోంది.

అది గమనించిన దీప నేను రావడంతో వీరు మాట మార్చారు అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దీప అక్కడినుంచి వెళ్ళిపోగానే మరోసారి భారతి ఫోన్ చేస్తుంది.అయితే ఆ ఫోన్ సౌందర్య లిఫ్ట్ చేయడంతో భారతి కార్తీక్ ప్లీజ్ నా మాట విను అంటూ ఉండగా నేను సౌందర్య మాట్లాడుతున్నాను అని చెబుతుంది. ఆంటీ కార్తీక్ మీరైనా చెప్పండి అని భారతి అనడం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ఆ మాట విన్న కార్తీక్ మళ్లీ ఫోన్ చేయడం ఏంటి మమ్మీ అంటూ అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతాడు.

ఇక హాస్పిటల్ లో మోనిత ఈ సమయాన్ని కూడా తనకు అనుకూలంగామార్చుకుంది. కార్తీక్ వచ్చే వరకు తను ఇంజక్షన్ వేయించుకొని, కార్తీక్ తన భర్తగా సంతకం పెట్టాలని డిమాండ్ చేస్తుంది. అప్పటికి పల్స్ రేట్ పడిపోవడంతో నర్స్ కంగారుపడుతూ మన హాస్పిటల్ కు చెడ్డపేరు వస్తుందని భయపెడుతుంది.ఆ తర్వాత భారతి సౌందర్యకు ఫోన్ చేసి ఆంటీ కార్తీక్ నా గురించి మీకు ఏం చెప్పాడు నాకు తెలియదు కానీ నేను రెండుసార్లు మోనితకి సహాయం చేశాను.అయితే ప్రస్తుతం మీరు ఇక్కడికి రావడం ఎంతో మంచిది లేదంటే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని రిక్వెస్ట్ గా అడిగింది.

ఇలా బయట ఆలోచిస్తూ కూర్చున్నా కార్తీక్ హాస్పిటల్ కి వెళ్దాం పద అంటూ అడగడంతో కార్తీక్ మమ్మీ నేను ఇప్పుడు అక్కడ తన భర్తగా సంతకం పెడితే దీపకి ఎంతో అన్యాయం చేసిన వాడు అవుతాను అంటూ బాధపడతాడు.ఆ మాటకు సౌందర్య ఇంకా భూమిపై పడిన ఒక చిన్న పసికందు మరణానికి మనం కారణం అవుదామ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ వెళ్దాం పద రా అంటూ ఉండగా దీప రావడంతో మరోసారి వీరిద్దరు మాట మారుస్తారు. అయితే దీప ఏదో జరుగుతుందని గట్టిగా నమ్ముతుంది.

ఇక పిల్లలు తన తప్పును తెలుసుకొని తనకు ఎలాంటి కోపం లేదని ఇక నుంచి అందరూ కలిసి సంతోషంగా ఉండాలని భావిస్తారు. ఇక మెట్లు దిగుతూ సౌందర్య పెద్దోడా అంటుండగా వంట చేస్తున్న దీప ఎక్కడికి అని అడుగుతుంది.ఏదో మొక్కుబడి ఉంది గుడికి వెళ్తున్నాం అని చెప్పగా ఒక రెండు నిముషాలు ఆగండి నేను కూడా తయారయ్యే వస్తానని దీప చెబుతోంది. ఆ మొక్కు కేవలం నేను కార్తీక్ మాత్రమే చెల్లించాల్సిందే అనే సౌందర్య అనడంతో దీపకి మరింత అనుమానం పెరుగుతుంది. ఇలా కార్తీక్ సౌందర్య హాస్పిటల్ కి వెళ్లగా దీప బాల్కనీలో నిలబడి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ వాళ్ళ గురించి ఆలోచనలో పడుతుంది.