chandrababu bjp
మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబును బీజేపీ గెలికి మరీ కౌంటర్ పెట్టుకోవాలని చూస్తోందా..? చంద్రబాబునే టార్గెట్ చేసిన ఆ పార్టీ.. ప్రస్తుతం అధికారంలోకి ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడా మాట్లాడడం లేదు. అంతేకాదు గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, అవినీతిపైనే ఎక్కుపెడుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు.చంద్రబాబు.. ఇప్పుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు. దశాబ్దాల రాజకీయ అనుభవం. పాలనలో, రాజకీయంలో ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేయాలంటే ఎవరికీ సాధ్యపడదు. కానీ.. గత ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతిని ఇప్పుడు డిఫెన్స్లోకి పడిపోయారు. ఆయన రాజకీయ జీవితం కాస్త ఒక్కసారిగా ఉల్టాపల్టా అన్నట్లు అయింది. అధికారంలో ఉన్నన్ని రోజులు వైసీపీ నేతలను ముఖ్యంగా జగన్ను ముప్పు తిప్పలు పెట్టారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. చంద్రబాబు మీద కక్ష తీర్చుకునే సమయం వచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీకి బీజేపీ కూడా తోడుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ పెద్దగా మైలేజ్ లేకున్నా కేంద్రంలోని అధికారాన్ని చెప్పుకొని చంద్రబాబు మీద రెచ్చి పోవాలని వ్యూహాలు రచిస్తోంది.
Also Read: జగన్ పై హిందువుల వ్యతిరేకతకు ప్రధాన కారణాలేమిటి?
బాబును చెడుగుడు ఆడుకోవడానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారట. బాబుని టార్గెట్ చేస్తూ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి వారు రోజూ ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తున్నారు. మీడియా సమావేశాల్లోనూ సోము వీర్రాజు గత పాలన గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన అమరావతి రాజధానికి కేంద్రం ఇచ్చిన ఏడు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి బాబూ అంటూ గట్టిగానే నిలదీశారు. బీజేపీ ఇలా ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబుతో కెలికి కయ్యం పెట్టుకోవాలని చూస్తోంది. ఆయన సహనానికి పరీక్ష పెడుతోంది. చంద్రబాబు రెచ్చిపోయి ఎప్పుడైనా రివర్స్ అటాక్ చేయకపోతారా అన్నట్లు వేచిచూస్తోందట. చంద్రబాబు ఆ వేడిలో ఏకంగా మోడీ మీదకు దండెత్తితే అదే ఆయనకు శాపంలా తయారవుతుందనేది బీజేపీ నేతల ఎత్తుగడట. మోడీని చంద్రబాబు ఏమైనా అంటే ఎప్పటికీ బాబుతో ఇక పొత్తు ఉండదని, ఆ విధంగా తమ పెద్ద నేతల మీద చంద్రబాబు నోరు పారేసుకుంటే దాన్ని సాకుగా చూపించి ఆయన్ని పూర్తిగా దూరం పెట్టాలన్నది బీజేపీ నేతల నయా వ్యూహంలా కనిపిస్తోంది.
Also Read: జగన్ తీసుకున్న ఆ నిర్ణయం మళ్లీ ఫెయిల్ కానుందా…?
‘తేనె తెట్టెను కుదిపితే ఎవరికి నష్టం.. అది అందరికీ తెలిసిందే..’.. అయితే చంద్రబాబు వంటి లీడర్ను కుదపాలనుకోవడం కూడా అలాంటిదేనని రాజకీయ వర్గాల్లో టాక్. అయితే.. ఏజ్ ప్రాబ్లంతో ఈ మధ్య బాబు కూడా కొంత అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. దీనినే తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ విమర్శలు శ్రుతి మించితే మాత్రం బాబుకు తపోభంగం కలగక మానదు అని కూడా అంచనా వేస్తున్నారు. అప్పుడు మళ్లీ బాబు మోడీనీ, బీజేపీ నేతలను తప్పకుండా టార్గెట్ చేస్తారు. ఎటుపెట్టి టీడీపీని దూరం చేయడమే టార్గెట్గా ఏపీ బీజేపీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి చంద్రబాబు ఏమైనా రివర్స్ అటాక్ చేస్తారా..? లేదా మోదీతో సంధి కోసం ప్రయత్నిస్తారా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Chandrababu dissapointed from bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com