spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Social Media Politics: వైసీపీ ఆరోపణల్లో పస లేదు.. సోషల్ మీడియాకే పరిమితం.. ఇలా...

YCP Social Media Politics: వైసీపీ ఆరోపణల్లో పస లేదు.. సోషల్ మీడియాకే పరిమితం.. ఇలా ఐతే కష్టమే!

YCP Social Media Politics: “పోలైన ఓట్లు.. లెక్కించిన ఓట్లు సమానం కాలేదు. అర్ధరాత్రి పూట నమోదైన పోలింగ్ ను వేరువేరు శాతాలలో చూపించారు. అర్ధరాత్రి పూట పోలింగ్ ఆస్థాయిలో ఎలా నమోదు అవుతుంది. ఈవీఎం లు మొత్తం వారి ఆధీనంలో ఉన్నాయి. కొన్నిచోట్ల నమోదైన ఓట్లకు.. లెక్కించిన ఓట్లకు సంబంధం లేకుండా పోయింది. ముమ్మాటికి ఇది ఈవీఎంల ద్వారా సాధించిన గెలుపు. ప్రజల్లో మాకే బలం ఉంది. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. మేము అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. దీనిపై పోరాటం చేస్తామని” వైసీపీ నేతలు 2024 నుంచి ఇప్పటివరకు చెబుతూనే ఉన్నారు.

తమ మీడియాలో ప్రభుత్వం మీద రెచ్చిపోతున్న వైసిపి నాయకులు.. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు.. క్షేత్రస్థాయిలో మాత్రం పీచే మూడ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు.. క్షేత్రస్థాయిలో మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మాత్రమే వైసిపి నాయకులు పులులు.. క్షేత్రస్థాయిలో కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ మీద ఇటీవల విపక్షాలు అభిశంషన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 130 మంది ఎంపీలు.. 60 మంది రాజ్యసభ సభ్యులు దీనిపై సంతకం చేశారు. ఈవీఎం మాయాజాలంతో ఎన్నికలు జరిగాయని.. తీర్మానంలో సభ్యులు పేర్కొన్నారు. ఈ తీర్మానంపై వైసీపీ నేతలు ఒక్కరు కూడా సంతకం చేయలేదు. ఎన్నికల సంఘంపై.. ఈవీఎం లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించిన విధానంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే దేశంలో ప్రతిపక్షాలు రాసిన తీర్మానంపై వైసీపీ నేతలు సంతకాలు చేయలేదు. కనీసం సొంత మీడియాలో దీనిపై ఒక వార్తను కూడా ప్రసారం చేయలేదు.

“సోషల్ మీడియాలో మొరిగితే ఉపయోగమేముంటుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ తీర్మానం మీద తన ఎంపీలతో.. రాజ్యసభ సభ్యులతో సంతకం చేయించాలి. అంత దమ్ము ఉందా.. కచ్చితంగా లేనేలేదు. అది గనక ఉండి ఉంటే సంతకం చేయాలి. లేకుంటే సోషల్ మీడియాలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడకుండా నవరాంద్రాలు మూసుకొని కూర్చోవాలని” కూటమి నేతలు చెబుతున్నారు. “2019లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. నాడు ఈవీఎంలు ఆ పార్టీ నేతలకు ఆనందంగా అనిపించాయి. ఇప్పుడు ఆ ఈవీఎంలు శత్రువులుగా మారిపోయాయి. 2024లో జరిగిన ఎన్నికలలో ఓటమి ఎదురైన తర్వాత ఆ పార్టీ నేతలకు ఈవీఎంలు శత్రువులుగా మారిపోయాయని” కూటమి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper