Homeఆంధ్రప్రదేశ్‌Telugu Popular Newspaper: అక్షర దోషాలు.. బండ తప్పులు.. ఇది ఒకప్పుడు నిప్పులు చిమ్మింది ఈ...

Telugu Popular Newspaper: అక్షర దోషాలు.. బండ తప్పులు.. ఇది ఒకప్పుడు నిప్పులు చిమ్మింది ఈ పత్రికేనా?..

Telugu Popular Newspaper: తెలుగు సొసైటీ ఈనాడు కు చాలా ఇచ్చింది. అందువల్లే ఈ లార్జెస్ట్ సర్కులేటెడ్ తెలుగు డైలీ అనే ట్యాగ్ లైన్ ఈనాడుకు మాత్రమే సొంతం అయ్యేలా చేసింది. అందువల్లే ఈనాడు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. నేటి స్మార్ట్ కాలంలోనూ ఈనాడు పేపర్ ను ప్రజలు ఎందుకు చదువుతున్నారు అంటే.. కొంతలో కొంత భాషా పరిజ్ఞానం బాగుంటుందని.. వార్తల ఎంపికలో కచ్చితంగా ఉంటుందని.. న్యూట్రల్ జర్నలిజాన్ని కొనసాగిస్తుందని నమ్ముతుంటారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకాలను క్రమేపీ దూరం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే రామోజీరావు బతికి ఉన్నప్పుడు.. తను యాక్టివ్ గా పేపర్ ను పరిశీలిస్తున్నప్పుడు.. ఈనాడులో అక్షర దోషాలు లేకుండా.. చూసుకునేవారు. అన్వయం కోల్పోయిన వార్తలు వెంటనే రౌండప్ చేసి జిల్లా బాధ్యులకు పంపించేవారు. పైగా క్వాలిటీ సెల్ ఆధ్వర్యంలో “దివిటి” ని రన్ చేసేవారు.. దీంతో ఈనాడు ఒక గ్రంథం లాగా.. తప్పులు లేని.. అక్షర దోషాలు లేని పుస్తకం లాగా ఉండేది. అందువల్లే తెలుగు మీడియాలో మకుటం లేని మహారాజు లాగా ఈనాడు వెలుగొందింది.

Also Read: Targets YCP Leaders : అష్టదిగ్బంధనం.. బెదిరిపోతున్న వైసీపీ నేతలు!

ఇప్పుడు పట్టించుకునే రామోజీరావు కాలం చేశారు. రామోజీరావు పెద్ద కుమారుడు ఈనాడు గ్రూపు సంస్థలకు చైర్మన్ గా ఉన్నారు. రామోజీరావు  చరమాంకంలో ఉన్నప్పుడే ఈనాడు ఒక రకమైన  నిర్లక్ష్యమైన దశలోకి వెళ్ళింది. ఇప్పుడు మరింత లోతుల్లోకి వెళ్తోంది. అక్షర దోషాలు మిగతా పత్రికల కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక అన్వయాలు అసలు కుదరడం లేదు. వార్తా రచన ఏ మాత్రం బాగుండడం లేదు. స్థూలంగా చెప్పాలంటే ఈనాడు పేపర్ ఒకప్పటిలాగా లేదు.. ప్రత్యేకమైన జర్నలిజం స్కూలు.. అద్భుతమైన లైబ్రరీ.. అత్యాధునిక టెక్నాలజీ.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈనాడు ఒకప్పటిలాగా పాఠకుల మనసుకు దగ్గర కాలేకపోతున్నది. వారి అభిమానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నది.

Also Read: Railway Employee Vinodh Sharma: నిజాయితీతో హీరోగా మారిన రైల్వే ఉద్యోగి.. హ్యాట్సాస్‌ పోర్టర్‌!

ఎన్ని అవరోధాలు ఉన్నా ఈనాడు నెంబర్ వన్ గానే ఉంటుంది. ఎందుకంటే దానికి సమీపంలో మిగతా పత్రికలు లేవు. ఒకవేళ ఉన్నా.. అవి ఈనాడును బీట్ చేయలేవు.. సాక్షికి ఇప్పుడు అంత సంపత్తి లేదు. ఆంధ్రజ్యోతికి ఈనాడు ను బీట్ చేసే అంత సీన్ లేదు ఏం ఇక నమస్తే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బహుశా ఈ ధైర్యం వల్లే కావచ్చు ఈనాడు సంపాదకీయ విభాగంలో పనిచేసే వారంతా నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తున్నారు. అక్షరానికి నఫిషీలు అద్ది.. అందంగా తీర్చి తీద్దాల్సిన చోట.. నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. పాఠకులు పైసలు పెట్టి కొనుక్కున్న కర్మానికి చదవక చస్తామా అన్నట్టుగా.. తిట్టుకుంటూ.. ఆ తప్పులను సవరించుకుంటూ.. చదివేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈనాడు తప్పులను కొంతమంది బట్ట బయలు చేస్తున్నారు.  తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper