Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Russia Visit: ఐటీ కాదు.. లోకేష్ మదిలో ఉన్నది వేరే.. దెబ్బకు గ్లోబల్...

Nara Lokesh Russia Visit: ఐటీ కాదు.. లోకేష్ మదిలో ఉన్నది వేరే.. దెబ్బకు గ్లోబల్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Russia Visit: ఇప్పటివరకు ఐటీ రంగం అత్యధిక ఉద్యోగాలను కల్పిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐటీ రంగానికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పించారు. ఆయన కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాణిజ్య విధానం నేడు హైదరాబాద్ నగరాన్ని మన దేశానికి రెండవ ఐటి రాజధానిగా చేసింది.

విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఐటీ రంగానికి విశేషమైన ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో దేశీయంగా పేరుపొందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా రూపకల్పన చేస్తున్నారు. గూగుల్ నుంచి మొదలు పెడితే టిసిఎస్ వరకు పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీరంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియడం లేదు ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. తన తండ్రి మాదిరిగానే వినూత్నంగా ఆలోచించి.. ఏపీ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

నారా లోకేష్ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్నారు. అక్కడ అనేక రకాల కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న విధానాల గురించి వెల్లడించారు. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోలేదు. ఏకంగా స్పేస్ పాలసీ గురించి వెల్లడించారు. తమ రాష్ట్రానికి స్పేస్ పాలసీ అనేది ఒకటి ఉందని.. తద్వారా రెండు ప్రత్యేకమైన స్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు.

రష్యాలోని ఎస్పీఐఎఫ్ వేదికగా జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడారు.. స్పేస్ సిటీల ద్వారా 25వేల కోట్ల పెట్టుబడులు.. 5000 మందికి ప్రత్యక్షంగా.. 30 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు అందిస్తామని ఆయన ప్రకటించారు.. అంతరిక్షంలో ప్రయోగాలు చేసే వాహనాలకు సంబంధించిన అసెంబ్లింగ్.. ఉపగ్రహాల తయారీ.. ఇతర పరికరాల కోసం తిరుపతి సమీపంలో దాదాపు 2,800 ఎకరాల విస్తీర్ణంలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు.

ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. కియా పరిశ్రమ రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఇంకా అనేక రకాల పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పుడు స్పేస్ సిటీ ద్వారా రాయలసీమలో ప్రధాన పట్టణమైన తిరుపతికి సరికొత్త గుర్తింపు రానుంది. ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రపంచ స్థాయి పేరు తెచ్చుకున్న తిరుపతి.. ఇప్పుడు పారిశ్రామికపరంగా కూడా సరికొత్తగా గుర్తింపును అందుకోనుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular