spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి కీలకమైన ఒక నిర్ణయం సంచలనంగా మారనుంది. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులను నేరుగా ఎన్నుకునే విధానాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పరోక్ష ఎన్నికల పేరుతో జరుగుతున్న బేరసారాల తతంగం, క్యాంపు రాజకీయాలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* ఇప్పటివరకు పరోక్ష విధానంలో..
ఇప్పటివరకు పరోక్ష ఎన్నికల విధానంలో స్థానిక సంగ్రామం జరిగేది. ఈ క్రమంలో అధికార బలం, ఆర్థిక ప్రాబల్యం, పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం వంటివి ఎక్కువగా జరిగేవి. మెజారిటీ రాని అధికార పార్టీలు ప్రతిపక్షాల నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసేవారు. క్యాంపు రాజకీయాలు ఎక్కువగా నడిచేవి. అధికారాన్ని హస్తగతం చేసేందుకు ఎన్నో రకాల వత్తులు ఎదురయ్యేవి. ప్రజల తీర్పు ఒకటైతే.. అధికార పీఠంపై కూర్చునేది మరొకరు అయ్యేవారు. ఈ అక్రమ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల చేతికి నేరుగా ఓటు హక్కు ఇవ్వడమే ఏకైక మార్గమని భావిస్తున్నారు.

* సాహస నిర్ణయం..
ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసించదు. ఎందుకంటే పరోక్ష విధానం ఉంటే వార్డుల్లో సీట్లు తగ్గినా.. సర్పంచ్ లేదా కౌన్సిలర్లను లొంగదీసుకుని మున్సిపాలిటీలు, జడ్పీ లను కైవసం చేసుకునే వెసుల బాటు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. అయితే అక్రమ మార్గాల్లో పీఠాలను దక్కించుకునే సంస్కృతి కంటే.. పారదర్శకమైన ప్రజా తీర్పుకే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఒక వ్యూహంతో ఉన్నారు. పరోక్ష ఎన్నికల్లో జరిగే కోట్లాది రూపాయల బేరసారాలకు స్వస్తి పలికితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జవాబుదారీ పెరుగుతుందనేది ఒక నమ్మకం.

* ఎన్టీఆర్ హయాంలో..
గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేవారు. 1987లో టిడిపి ప్రభుత్వ హయాంలో తొలిసారిగా మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ లను నేరుగా ప్రజలే ఓటు వేసి ఎన్నుకునే వారు. కానీ 2000 దశకంలో చంద్రబాబు హయాంలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ లను నేరుగా ఎన్నుకునే పద్ధతి నడిచింది. కానీ తర్వాత పాత పద్ధతిని ప్రభుత్వాలు పునరుద్ధరించాయి. చట్టపరమైన కోణంలో చూస్తే భారత రాజ్యాంగంలోని 243 సి పంచాయితీలు, 243 ఆర్ మున్సిపాలిటీలు నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల అధ్యక్షులు ఎన్నికల విధానాన్ని నిర్ణయించే సర్వాధికారాలు రాష్ట్ర శాసనసభకు ఉన్నాయి. దీనికోసం ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1994, ఏపీ మున్సిపాలిటీ చట్టం 1965, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994 లకు అసెంబ్లీలో సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే కూటమికి అసెంబ్లీలో అత్యధిక మెజారిటీ ఉండడంతో ఈ చట్ట సవరణలు చేయడం సునాయాసమైన ప్రక్రియ. కచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నిక రావడం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper