Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Andhra pradesh new ration cards issue coalition government decision

Andhra Pradesh : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!

Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Written By:Dharma Raj, Updated On : April 2, 2025 / 09:36 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Andhra Pradesh New Ration Cards Issue Coalition Government Decision

Ration cards

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా కొత్త రేషన్ కార్డుల జారీపై అనేక రకాలుగా ప్రచారం నడిచింది. ఈ తరుణంలో తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ నడుస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డులో ఉన్న ప్రతి లబ్ధిదారుడి ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. అటు తరువాతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని తాజాగా క్లారిటీ వచ్చింది. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన సంతోషం వ్యక్తం అవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.

Also Read : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. కీలక ప్రకటన చేసిన సీఎం

కూటమి ( Alliance) అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు స్పష్టమైన ప్రకటన చేశారు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 30 తో ఈ కేవైసీ ప్రక్రియ ముగియనుంది. వెనువెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజు తగ్గించి అన్ని వివరాలతో వీటిని జారీ చేయనున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆశలు చిగురిస్తున్నాయి. గత కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం లక్షలాదిమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

* ఏళ్ల తరబడి నిలిచిన ప్రక్రియ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. లక్షలాదిమంది దరఖాస్తులు చేసుకున్న మంజూరు ప్రక్రియ మాత్రం జరగలేదు. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తోంది. ఇప్పటికీ చాలామంది అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల జోడింపులు, తొలగింపులకు అవకాశం ఇవ్వబోతున్నారు. ఇదే విషయంపై స్పష్టతనిచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్.

* క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు..
అయితే ఈసారి మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానంగా రేషన్ కార్డుల ప్రక్రియ జారీ జరగనుంది. క్యూఆర్ కోడ్ లాంటి భద్రత ఫీచర్లతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని మంత్రి వెల్లడించారు. అయితే గత ఐదేళ్లుగా రేషన్ కార్డులపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అయితే ఈసారి రేషన్ కార్డులపై ఎవరి బొమ్మలు ఉండవని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేవైసీ పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీపై ఒక స్పష్టత రానుంది. దాదాపు అర్హులందరికీ రేషన్ కార్డులు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

* అనర్హులకు పెద్దపీట..
గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అనర్హులకు రేషన్ కార్డులు( ration cards ) జారీ చేశారని విమర్శ ఉంది. దానిని సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఈ కేవైసీకి పూనుకుందని ఒక ప్రచారం ఉంది. వాస్తవానికి లక్షలాదిమంది దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం చేసుకున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత అనర్హులను ఏరివేయనుంది. అటు తరువాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read : కరువుపై ఏపీ ప్రభుత్వం ప్రకటన!

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Read More

Web Title: Andhra pradesh new ration cards issue coalition government decision

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Alliance
  • Andhra Pradesh
  • chandrababu
  • ration cards
  • YSR Congress
Follow OkTelugu on WhatsApp

Related News

Rajnath Singh Chandrababu: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో చంద్రబాబు భేటీ

Rajnath Singh Chandrababu: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో చంద్రబాబు భేటీ

Nadendla Manohar : శభాష్ నాదెండ్ల రేషన్ బియ్యం ఇకనుంచీ దుకాణం నుంచే

Nadendla Manohar : శభాష్ నాదెండ్ల రేషన్ బియ్యం ఇకనుంచీ దుకాణం నుంచే

Girl Child Fund : ఆడబిడ్డ నిధి పథకం.. ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో నెల నెల రూ.1500.. వెంటనే అప్లై చేసుకోండి..

Girl Child Fund : ఆడబిడ్డ నిధి పథకం.. ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో నెల నెల రూ.1500.. వెంటనే అప్లై చేసుకోండి..

New District : ఏపీలో కొత్తగా ఆ జిల్లా.. కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్!

New District : ఏపీలో కొత్తగా ఆ జిల్లా.. కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్!

Y S Jagan Mohan Reddy: కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?

Y S Jagan Mohan Reddy: కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?

Visakha Municipal Corporation : గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కుల చిచ్చు!.. ఆ 15 మంది కార్పొరేటర్లు ఔట్!

Visakha Municipal Corporation : గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కుల చిచ్చు!.. ఆ 15 మంది కార్పొరేటర్లు ఔట్!

Anil Kumar Yadav : అనిల్ కుమార్ యాదవ్ మాటలకు అర్ధాలే వేరులే!

Anil Kumar Yadav : అనిల్ కుమార్ యాదవ్ మాటలకు అర్ధాలే వేరులే!

YCP : వైసీపీకి షాక్.. ఆ ఎన్నికల్లో కూటమి విజయం!

YCP : వైసీపీకి షాక్.. ఆ ఎన్నికల్లో కూటమి విజయం!

Jagan : అది జగన్ ట్రాప్.. గుణపాఠాలు నేర్వని కూటమి!

Jagan : అది జగన్ ట్రాప్.. గుణపాఠాలు నేర్వని కూటమి!

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.