spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Tirumala: తిరుమల వెంకన్న సాక్షిగా.. నడకదారిలో నవవరుడిని కబళించిన మృత్యువు

Tirumala: తిరుమల వెంకన్న సాక్షిగా.. నడకదారిలో నవవరుడిని కబళించిన మృత్యువు

Tirumala : వివాహం జరిగి 15 రోజులు అవుతోంది. తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు ఆ నవ జంట బయలుదేరింది. మెట్ల మార్గంలో వెళ్తుండగా వరుడు గుండె నొప్పితో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించే లోగా మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నవ వధువు బాధ వర్ణనాతీతం. తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి చెందిన నవీన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. 15 రోజుల కిందట ఆయనకు వివాహం జరిగింది. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనానికి బయలుదేరాడు. తిరుపతి నుంచి కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరాడు. నడుచుకుంటూ వెళుతుండగా ఆయాసానికి గురయ్యాడు. 2350 వా మెట్టు దగ్గరకు రాగానే నవీన్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. దగ్గర్లో ఉన్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అంబులెన్స్ లో నవీన్ ను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నవీన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

* 15 రోజులు కిందట వివాహం
15 రోజుల కిందట యువతి తో నవీన్ కు వివాహం జరిగింది. పెళ్లిని ఎంతో వేడుకగా చేసుకున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంలో మునిగిపోయారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని భావించారు. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనపై తిరుమల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* జంట ఆత్మహత్యాయత్నం
తిరుమలకు నడిచి వెళ్లే శ్రీవారి మెట్లు మార్గంలో ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిత్తూరు కొంగారెడ్డిపల్లికి చెందిన వివాహిత, మరో యువకుడితో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. శ్రీవారి మెట్ల మార్గంలో రసాయనాలు తాగి వారిద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇంతలోనే భద్రతా సిబ్బంది స్పందించి వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

* ఒకే రోజు రెండు ఘటనలు
ఒకే రోజు తిరుమల మెట్ల మార్గంలో ఈ రెండు ఘటనలు జరగడం కలకలం సృష్టించింది. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారు మెట్ల మార్గం లో వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. నవీన్ ముందుగా అలసటకు గురయ్యాడు. 2350 మెట్టు చేరుకునేసరికి ఆయాసంతో గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ఎదుట నవవరుడు కుప్ప కూలిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తే ఈ విషాదం ఏంటని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version