Homeఅంతర్జాతీయంTrump And Narendra Modi: ట్రంప్ కు భరించలేని కడుపు మంట.. మోడీ సార్ కొంచెం...

Trump And Narendra Modi: ట్రంప్ కు భరించలేని కడుపు మంట.. మోడీ సార్ కొంచెం గ్యాప్ ఇవ్వండి..

Trump And Narendra Modi: మొన్నటికి మొన్న మన దేశానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వచ్చాడు.. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు మన వాళ్ళు. స్వాగతం కాదు కదా రెడ్ కార్పెట్ కూడా వేయలేదు. సీఐ స్థాయి అధికారులను పంపించి పరువు తీశారు. అమెరికా అంటే మాకు వెంట్రుకతో సమానం అన్నట్టుగా వ్యవహరించారు. ఇక మీడియా సమావేశంలో మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఏమాత్రం భయం అనేది లేకుండానే మాట్లాడారు. ఒకప్పుడు అమెరికాను చూస్తే చుచ్చు పోసుకొనే భారత ప్రజాప్రతినిధులను చూసిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో.. జై శంకర్ వ్యవహరించిన తీరు పట్ల ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంతేకాదు క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ తన వైఖరి చెప్పడంతో తల పట్టుకున్నాడు. చివరికి అతనికి వీడ్కోలు కూడా మనవాళ్లు సరిగా ఇవ్వలేదు. మళ్లీ అదే సీఐ స్థాయి అధికారులతో సెండాఫ్ ఇచ్చారు.

కేవలం రూబియో మాత్రమే కాదు.. ట్రంప్ కు కూడా భారత్ చుక్కలు చూపిస్తోంది. ప్రపంచ దేశాల దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. రష్యా నుంచి మొదలుపెడితే వెనుజులా వరకు అన్ని ప్రాంతాలలో క్రూడ్ ఆయిల్ కొంటూనే ఉంది. ఎన్ని రకాలుగా ఆంక్షలు విధించినప్పటికీ పక్కనపెడుతోంది. చివరికి మోడీని వంచాలని అమెరికా అధ్యక్షుడు చేయని పని అంటూ లేదు. డీప్ స్టేట్ కూడా రంగంలోకి దిగింది. అయినప్పటికీ దేశ ప్రయోజనాల విషయంలో మోడీ తలవంచలేదు. ట్రంప్ ముందు మోకారిల్ల లేదు.

మనదేశ నౌకల మీద అమెరికా దాడి చేసి.. ముగ్గురు భారతీయ పౌరుల మరణానికి కారణమైన నేపథ్యంలో.. మన దేశ విదేశాంగ శాఖ వెంటనే రెస్పాండ్ అయింది. భారత్ లో ఉంటున్న అమెరికా రాయబారులను పిలిపించింది. సమన్లు జారీ చేసింది. అమెరికా చరిత్రలో అమెరికా రాయబారులకు భారతదేశం సమన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. శ్వేత సౌధాధిపతి నుంచి ఒత్తిడి ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఇండియా ఏ మాత్రం తలవంచలేదు.

పైగా ఇటీవల ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్ కాడని.. తాను ఎన్ని చెప్పినప్పటికీ తాను తల పంచడం లేదని పేర్కొన్నాడు. ఎప్పటికైనా నరేంద్ర మోడీ నుంచి సానుకూల స్పందన వస్తుందో చూస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి నరేంద్ర మోడీ దేశం విషయంలో ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. అగ్రరాజ్య రాయబారులకు సమన్లు జారీ చేసి ఇండియా అంటే ఏమిటో మోడీ నిరూపించాడు. అంతేకాదు తమ జోలికి వస్తే వేరే విధంగా ఉంటుందని హెచ్చరికలు పంపించాడు.

మన దేశ పౌరులను అమెరికా అనవసరమైన దాడులు చేసి చంపిన నేపథ్యంలో నరేంద్ర మోడీ ఇంతవరకు పరోక్షంగా మాత్రమే స్పందించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ.. అనేక రకాల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తద్వారా అమెరికా ప్రమేయం లేకుండానే భారత్ ఎగుమతులు.. ఇతర వ్యవహారాలు సాగించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ముగ్గురు భారత పౌరుల మరణం పై ఇప్పటికే మన దేశ విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసింది. అమెరికా తీరు పట్ల మండిపడింది. అదే కాదు అమెరికన్ రాయబారులకు సమన్లు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితోనే భారత్ ఆపి వేసే విధంగా కనిపించడం లేదు.. మరింత తీవ్రతరం చేసే పనిలోనే ఉంది. వచ్చే రోజుల్లో ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.