spot_img
Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్‌ గెలవాలని ఇండియాలో పూజలు.. ఎక్కడ చేస్తున్నారు.. ఎవరు చేస్తున్నారో తెలుసా?

Donald Trump: ట్రంప్‌ గెలవాలని ఇండియాలో పూజలు.. ఎక్కడ చేస్తున్నారు.. ఎవరు చేస్తున్నారో తెలుసా?

Donald Trump: ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికావైపు ఇప్పుడు అన్నిదేశాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ట్రంప్‌ గెలవాలని కోరుకుంటే.. కొందరు కమలా హారిస్‌ గెలవాలని కోరుకుంటున్నారు. మరోవైపు అమెరికాలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్‌పైనే చాలా మంది బెట్టింగ్‌ పెడుతున్నారు. కొన్ని గంటల్లో ఎవరు గెలుస్తారో తేలిపోనుంది. ఈ క్రమంలో ఇండియాలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలవాలని పూజలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక వేత్త మహా మండలేశ్వరస్వామి వేదముతినంద సరస్వతి ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్నవారు తమ చేతిలో ట్రంప్‌ ఫొటో పట్టుకుని కనిపించారు. వేదమంత్రాలు, శంకునాదాల మధ్య పూజలు జరిగాయి. ఈ సమయంలో నరేంద్రమోదీ, ట్రంప్‌ ఉన్న ఫొటోను కూడా ఓ పండితుడు పట్టుకున్నాడు. కమలా హారిస్‌ భారత సంతతి నేత అయినా.. వీరు ట్రంప్‌ గెలవాలని కోరుకుంటున్నారు.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ..
అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతర్జాతీయ వ్యూమాత్మక పొత్తులకు కేంద్ర బిందువు. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఎన్నికలు పలు అంతర్జాతీయ అంశాలలో వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం వ్యవహారాల్లో అమెరికా పాత్ర ముగిసిపోవాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ కోరుకుంటున్నారు. ఈ అంశంలో అమెరికా జోక్యం పెరగాలని డెమోట్రకిట్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ భావిస్తున్నారు.

మొదలైన ముందస్తు పోలింగ్‌..
ఇదిలా ఉంటే.. అమెరికాలో ముందస్తు పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే సుమారు 7 కోట్ల మంది ఓటు వేశారు. మంగళవారం(నవంబర్‌ 5న) జరిగే పోలింగ్‌లో మిగతావారు ఓటువేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కూడా కీలకంగా మారారు. స్వింగ్‌ స్టేట్స్‌లో భారతీయుల ప్రభావం ఎక్కువ. దీంతో ఇద్దరు నేతలు స్విగ్‌ స్టేట్స్‌పై దృష్టి పెట్టారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version