Japan: ఒంటరై పోతున్నారు.. ఏడాదిలో ఆ దేశంలో 40 వేల ఒంటరి మరణాలు.. దయనీయ స్థితిలో వృద్ధులు!

జపాన్‌.. ఈ పేరు వింటేనే అందరికీ గుర్తొచ్చేది టెక్నాలజీ. చిన్న దేశమే అయినా.. టెక్నాలజీ తయారీ, వినియోగంలో జపనీయులు తోపులు. రోబోల తయారీలో దిట్ట. అణుబాంబు దాడికి గురైనా.. భూకంపాలు అతలా కుతలం చేస్తున్నా.. అభివృద్ధిలో ఆ దేశం దూసుకుపోతోంది.

Written By: Raj Shekar, Updated On : August 31, 2024 6:10 pm

Japan

Follow us on

Japan: జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న దేశం. చాలా చిన్న దేశమే అయినా.. ఆ దేశంలో అందరూ పనిచేస్తారు. అదే ఆ దేశానికి బలం. ఇక తమ తెలివితో అభివృద్ధి చేసిన టెక్నాలజీని అగ్రదేశాలకూ విక్రయిస్తారు. ప్రపంచంలో చాలా వస్తువులు మేడిన్‌ జపాన్‌వే ఉంటాయి. ఇంత టెక్నాలజీ కలిగిన జపాన్‌లో జనాభా తగ్గుతోంది. పిల్లలు పుట్టకపోవడంతో అక్కడి జనాభా తగ్గుతోంది. ముఖ్యంగా యువత తగ్గిపోతున్నారు. ఇదే ఇప్పుడు ఆదేశానికి అతిపెద్ద సమస్య. ఈ సమస్య పరిష్కారానికి జపాన్‌ ప్రభుత్వం పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. అయినా పిల్లలు కనేందుకు జపనీయులు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యతోనే జపాన్‌ సతమతమవుతుంటే.. తాజాగా మరో సమస్య ఆదేశాన్ని ఇబ్బంది పెడుతోంది. జపాన్‌లో వృద్ధులు ఒంటరిగా మరణిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 40 వేల మంది వృద్దులు తమ ఇళ్లలో ఒంటరిగా మరణించినట్లు ఆ దేశ పోలీసులే తెలిపారు. వీరిలో 4 వేల మందిని మరణించిన నెల తర్వాత గుర్తించారు. 13 మంది మరణాలను ఏడాది తర్వాత గుర్తించారు. ఇంత దయనీయ పరిస్థితికి కారణం తెలుసుకుందాం.

పురాతన దేశం..
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జనాభా కలిగిన దేశం జపాన్‌గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. జపాన్‌లో ఒంటరిగా జీవిస్తున్న మరియు మరణిస్తున్న అనేక మంది వృద్ధుల సమస్యను హైలైట్‌ చేయడానికి నేషనల్‌ పోలీస్‌ ఏజెన్సీ తన నివేదికను లక్ష్యంగా పెట్టుకుంది. 2024 మొదటి అర్ధభాగం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, మొత్తం 37,227 మంది ఒంటరిగా నివసిస్తున్నారు, 65 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మొత్తం 70% కంటే ఎక్కువ మంది ఉన్నారు.

గమనించని మరణాలు
ఇంట్లో ఒంటరిగా మరణించిన వారిలో 40% మంది ఒక రోజులో కనుగొనబడ్డారని పోలీసు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ, దాదాపు 3,939 మృతదేహాలు మరణించిన ఒక నెల కంటే ఎక్కువ కాలం తర్వాత గుర్తించారు. 130 మృతదేహాలు మరణించిన ఏడాది తర్వాత గుర్తించారు. మరణించిన వ్యక్తులలో 7,498 మంది 85, అంతకంటే ఎక్కువ వయసువారే. 75–79 సంవత్సరాల వయసు వారు 5,920 మంది ఉన్నారు. 70–74 సంవత్సరాల వయసు వారు 5,635 మంది ఉన్నారు.

పెరుగుతున్న వృద్ధులు..
జపనీస్‌ నేషనల్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ అండ్‌ సోషల్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో పేర్కొంది, 2050 నాటికి ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ పౌరుల (65 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) సంఖ్య 10.8 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇక ‘ఏకాంత మరణాలు‘ అని పిలవబడే వాటితో జపాన్‌ చాలా కాలం పాటు పోరాడుతోంది.

ఎందుకీ దయనీయ స్థితి..
జపాన్‌ ప్రపంచంలోనే అత్యంత పురాతన సమాజం ఉంది. 80 ఏళ్లు దాటిన వారు చాలా మంది ఉన్నారు. వీరికి వారసులు లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. ఒంటరిగానే మరణిస్తున్నారు. ఒవరి పనిలో వారు ఉండడం కూడా సమస్యకు మరో కారణం. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ అండ్‌ సోషల్‌ సెక్యూరిటీ రీసెర్చ్‌ అంచనా ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2020లో 7.38 మిలియన్ల నుండి 2030లో 8.87 మిలియన్లకు, 2050 నాటికి 10.84 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది.