క్రీడలుIndia vs New Zealand 1st Odi: ఉప్పల్ లో పరుగుల సునామీ: న్యూజిలాండ్ పై...

India vs New Zealand 1st Odi: ఉప్పల్ లో పరుగుల సునామీ: న్యూజిలాండ్ పై గిల్ డబుల్ సెంచరీ

India vs New Zealand 1st Odi: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో శుభ్ మన్ గిల్ రెచ్చిపోయాడు. వన్డేల్లో తొలిసారి డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అద్భుత ఆటతీరుతో కివీస్ కు భారీ లక్ష్యం నిర్దేశించాడు. 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్థిక్ (28) కాస్త ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో మిెల్, పిప్లే చెరో రెండు వికెట్లు తీయగా ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.

India vs New Zealand 1st Odi
India vs New Zealand 1st Odi

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా శుభ్ మన్ గిల్ నిలిచాడు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తరువాత స్థానంలో గిల్ సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ (208: 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సులు) తో పరుగుల వరద పారించాడు. దీంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. 145 బంతుల్లోనే 200 స్కోరు దాటడం విశేషం. 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 122 బంతుల్లో 150 పరుగులు రాబట్టాడు.

తరువాత 50 పరుగులను 23 బంతుల్లోనే చేరుకున్నాడు. కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరాశపరచినా గిల్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆకాశమే హద్దుగా కివీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్సులు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. హైదరాబాద్ వాసుల పరుగుల దాహాన్ని తీర్చాడు. గిల్ ఆట చూసిన వారికి ఉత్సాహం ఉరకలేసింది. అతడి బ్యాటింగ్ విన్యాసాలు చూసి ముచ్చెట చెందారు. చాలా రోజుల తరువాత పరుగుల వర్షంలో అభిమానులు తడిసిపోయారు.

India vs New Zealand 1st Odi
India vs New Zealand 1st Odi

టీమిండియా భారీ స్కోరు సాధించడంతో విజయంపై ధీమాగా ఉంది. ఇక బౌలర్ల వంతు ఉంది. బ్యాటింగ్ లో మాత్రం ఇరగదీశారు. బౌలింగ్ లో కూడా వారిని కట్టడి చేస్తే భారీ విజయం నమోదు కావడం తథ్యమే. ఇప్పటికే శ్రీలంపై టీ20, వన్డే సిరీస్ లు రెండు కైవసం చేసుకున్న ఇండియా మరో విజయంపై కన్నేసింది. కివీస్ ను కట్టడి చేసి బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు ఆటగాళ్లు కూడా అదే విధంగా కదులుతున్నారు. మొత్తానికి ప్రేక్షకులకు పరుగుల వర్షం కురిపించి వారిని సంతోషపరిచారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Most Popular

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్...

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా...

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం...
Exit mobile version