HomeతెలంగాణElectricity Charge : నవంబర్‌ నుంచి తెలంగాణ ప్రజలకు మరో షాక్‌.. ఇక బాదుడే బాదుడు

Electricity Charge : నవంబర్‌ నుంచి తెలంగాణ ప్రజలకు మరో షాక్‌.. ఇక బాదుడే బాదుడు

Electricity Charge : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉండడం, టీపీసీసీ చీఫ్‌గా తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి అనేక హామీలతోపాటు, ఆరు గ్యాంరటీ హామీలు ఇచ్చాడు. దీంతో ఓటర్లు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. పదినెలల కాలంలో కొన్ని హామీలు అమలు చేశారు. ముఖ్యంగా రూ.2 లక్షల రుణమాఫీ అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తోంది. అయితే సబ్సిడీల భారం పెరగడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ప్రధానంగా విద్యుత్‌ సంస్థలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సెప్టెంబర్‌లో ఈమేరకు ప్రతిపాదనలు చేసింది. దీనిపై సోమవారం(అక్టోబర్‌ 21 ) నుంచి ఐదు రోజులు విచారణ చేపట్టనుంది విద్యుత్‌ నియంత్రణ మండలి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లమేర విద్యుత్‌చార్జీలు పెంచాలని విద్యుత్‌ రెగ్యులేటరీ సంస్థ ప్రతిపాదించింది.

ప్రతిపాదనలు ఇలా..
టీజీఎస్‌పీడీసీఎల్, టీజీ ఎన్‌పీడీసీఎల్‌ విద్యుత్‌ చార్జీలు పెంచాలని కోరుతున్నాయి. హెచ్‌టీ కేటగిరీ విద్యుత్‌ చార్జీల పెంపు, ఎల్‌టీ కేటగిఈలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి íఫిక్స్‌డ్‌ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. ఈమేరకు విద్యుత్‌ నియంత్రణ మండలి విచారణ ప్రారంభించింది. నష్టాలు పూడ్చుకోవడంతోపాటు బకాయిల భారం తగ్గించుకునేందకు ఈఆర్సీకి ప్రతిపాదనలు చేశాయి. అయితే విచారణ అనంతరం చార్జీల పెంపునకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్‌ బకాయిలు నెలనెలా చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి చార్జీల పెంపు అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

లోటు పూడ్చుకునేందుకు..
తెలంగాణలో ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య లోటు 14,222 కోట్లుగా అంచనా వేశాయి. ఈ మొత్తంలో 13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సమకూర్చాలని కోరాయి. మిగిలిన 1,200 కోట్లు చార్జీల పెంపుద్వారా సమకూర్చుకునే అవకాశం క ల్పించాలని కోరాయి. ప్రస్తుతం 300 యూనిట్లు దాటితే కిలో వాట్‌కు స్థిర చార్జీ రూ.10 వసూలు చేస్తుండగా దానిని రూ.40 పెంచాలని విద్యుత్‌ సంస్థలు కోరుతున్నాయి. అంటే 200 యూనిట్లలోపు వారికి ఎలాంటి భారం పడదు. ఇక రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్లకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 300 యూనిట్లలోపు విద్యుత్‌ వాడుకునే కనెక్షన్లు 80 శాతం ఉన్నాయి. దీనితో చార్జీల పెంపు భారం ప్రజలపై పడదని డిస్కంలు చెబుతున్నాయి.

ఒకే కేటగిరీ కిందకు పరిశ్రమలు..
ఇక ప్రస్తుతం హెచటీ పరిశ్రమల జనరల్‌ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 11 కేవీ సామర్థ్యంతో కనెక్షన్‌ తీసుకున్న పరిశ్రమలకు యూనిట్‌కు రూ.7.65 వసూలు చేస్తున్నారు. 33 కేవీ సామర్థ్యంతో కనెక్షన్‌ తీసుకుంటే యూనిట్‌కు రూ.7.15 వసూలు చేస్తున్నారు. 132కేవీ అయితే రూ.6.65 వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని కేటగిరీలను ఒకే కేటగిరీగా ప్రతిపాదించి రూ.7.65 వసూలు చేయాలని డిస్కంలు కోరుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper