spot_img
HomeతెలంగాణMedchal Police Arrest: ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలతో తల్లీకొడుకుల పాడు పని.. విచారణలో పోలీసులకే...

Medchal Police Arrest: ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలతో తల్లీకొడుకుల పాడు పని.. విచారణలో పోలీసులకే దిమ్మ తిరిగింది..

Medchal Police Arrest: ఇటీవల సికింద్రాబాద్లో సృష్టి ఐ వి ఎఫ్ సెంటర్ దందా బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యంగా ఫెర్టిలిటీ సెంటర్ లపై దృష్టి సారించింది. ఈ క్రమంలో హైదరాబాదు నగరంలో యాచకులు.. ఇతర వ్యక్తుల నుంచి వీర్యం.. కొంతమంది మహిళల నుంచి అక్రమ విధానాలలో అండాలు సేకరిస్తున్న దందా బయటపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఐవీఎఫ్ కేంద్రాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగానే ఓ తల్లీ కొడుకు చేస్తున్న పాడు పని బయటపడింది.

Also Read: గో బ్యాక్ మార్వాడి.. తెలంగాణలో ఎందుకీ ఉద్యమం?

హైదరాబాదులోని మేడ్చల్ ప్రాంతంలో లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డి అనే తల్లీ కొడుకులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.. మీరు ఒక బహుళ అంతస్తుల భవనంలో సరోగసి దందా చేస్తున్నట్టు తేలింది. వివిధ రాష్ట్రాల చెందిన మహిళలను ఇక్కడికి తీసుకొచ్చారు. వారిని ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేలా చేస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు. పిల్లలు లేని ధనవంతుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని వీరు ఈ సరోగసి దందాకు పాల్పడుతున్నారు. ఒక్కో సరోగసికి దాదాపు 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. వీరికి హైదరాబాద్ నగరంలోని పలు ఐవీఎఫ్ కేంద్రాల నిర్వాహకులతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.. పిల్లలు లేని ధనవంతులతో ముందుగానే డీల్ మాట్లాడుకొని.. అడ్వాన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో చెందిన మహిళల వివరాలు వారికి అందిస్తారు. ఇందులో ఆరోగ్యంగా ఉన్న మహిళను ఎంపిక చేసుకొని ఆమెకు ఐవిఎఫ్ ద్వారా గర్భవతిని చేస్తారు.

Also Read: మునుగోడు ఎమ్మెల్యేకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అవసరం లేదట..

నెల తప్పిన నాటి నుంచి మొదలుపెడితే ప్రసరించే వరకు వీరు తమ ఆధ్వర్యంలో ఉంచుకుంటారు. వారికి పౌష్టికాహారం అందిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. గర్భవతులను బయటి ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఒప్పుకోరు. బహుళ అంతస్తులోనే అత్యంత అధునాతన సౌకర్యాలు కల్పిస్తుంటారు.. ఆ తర్వాత పౌష్టికాహారం, మందులు అందిస్తుంటారు. అనంతరం వారు ప్రసవించిన తర్వాత కొద్ది రోజులపాటు పాలు ఇచ్చిన తర్వాత.. అనంతరం బయటికి పంపిస్తుంటారు. ఇటీవల సృష్టి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. పోలీసుల దృష్టికి లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డి వ్యవహారం వచ్చింది.. ఆ తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత వీరిద్దరిని అరెస్ట్ చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper